యువ నటుడు, మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రతిరోజు పండగే. యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ల పై ఎంతో భారీగా నిర్మితం అయిన ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమాపై మెజారిటీ ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ని వ్యక్తం చేస్తున్నారు. మంచి కామెడీ తో పాటు హృదయానికి హత్తుకునే మంచి ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో ఎంతో బాగా కుదిరాయని, 

 

హీరో సాయి ధరమ్ తేజ్ మరియు హీరోయిన్ రాశి ఖన్నా ల జోడి కూడా సినిమాలో ఎంతో అద్భుతంగా వుండడంతో పాటు వారిద్దరిమద్య ఫన్నీ మరియు రొమాంటిక్ సీన్స్ బాగా కుదిరాయని అంటున్నారు. సీనియర్ నటులు సత్య రాజ్, రావు రమేష్ వంటి వారు సినిమాకు ప్రధాన బలంగా నిలిచారని, ఇక రావు రమేష్ అయితే మంచి కామెడీ టైమింగ్ తో తన పాత్రకు మరింత జీవం పోసి, తన తండ్రి రావు గోపాల రావుని కొన్ని సీన్స్ లో గుర్తు చేసారని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, ఇక సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ వంటివి బాగా ఎలివేట్ అయ్యాయని అంటున్నారు. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ బాగా యాక్ట్ చేసినప్పటికీ కూడా, 

 

ఇటువంటి కుటుంబ కథలకు శర్వానంద్ అయితే మరింత బాగుండేవాడని, ఎందుకంటే గతంలో అతడు శతమానం భవతి వంటి కుటుంబ కథా సినిమాలో నటించి ఉండడంతో కొందరు ప్రేక్షకులు అలా అంటున్నారు. సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో చాలా బాగుందని, ఓవర్ ఆల్ గా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్ అని చెప్పవచ్చట. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: