బాలీవుడ్ అంటే టాలీవుడ్ బ్యూటీస్ కి మోజు ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఉత్తరాదిన ఒక వెలుగు వెలగాలని దక్షిణాది భామలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సీనియర్ హీరోయిన్స్ ఎంతమందో బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ట్రెండు మారింది. బాహుబలి తరువాత నార్త్ హీరోయిన్సే దక్షిణాది సినిమాల్లో నటించాలని ఉబలాటపడుతున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికినా వదులుకోవడం లేదు. ఎంత చిన్న సినిమా అయినా సరే దక్షిణాదికి సై అంటున్నారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్లకు ఓకే చెప్పేస్తుండడం ఇప్పుడు సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి దర్శకుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కి  ఓకే చెప్పిన ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించే ఛాన్సుందన్న గుసగుస వినిపిస్తోంది. 

 

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో ఆలియా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ కి సంప్రదింపులు చేస్తున్నారట. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు. మహేష్ ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

 

ఈ సినిమాలో ఓ క్రేజీ పాత్రకు అలియాభట్ ని చిత్రబృందం సంప్రదించారని తాజా సమాచారం. అసలు ఇందులో ఆలియా పాత్ర ఎలా ఉండనుంది? అది పూర్తి స్థాయి పాత్రనా... లేక కొద్ది నిమిషాలు కనిపించే అతిధి పాత్ర తరహానా? అన్నది చిత్రబృందం ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. అన్నట్టు వరుసగా క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్న ఆలియా మరో తెలుగు సినిమాకి అంగీకరించే అవకాశముందా? అన్నది ఆలియా క్లారిటి ఇవ్వాలి. ఇక ఆలియా కోసం నమ్రత- మహేష్ బృందం సీరియస్ గానే ట్రై చేస్తున్నారని మరో హాట్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.
   

మరింత సమాచారం తెలుసుకోండి: