డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా వేగంగా సినిమాలు తీస్తాడనే పేరుంది. కేవలం 3 నెలల్లో సినిమాని రిలీజ్ చేసేంత స్పీడ్ ఇంకే డైరెక్టర్ కి లేదన్న మాట మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. అంతే కాకుండా డైలాగ్స్ రాయడంలో.. కథను నేరేట్ చేయడంలోనూ.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరిలో పూరి స్టైల్ ఇంకెవరికి లేదు. అయితే ఆయన ప్రతిభ ఇంతవరకే పరిమితమా? అంటే.. ఇకపై లిరిసిస్టుగానూ రాణించేస్తున్నారట. పూరి లేటెస్టుగా మరో కొత్త అవతారం ఎత్తారన్న వార్త ఇప్పుడు మన ఇండస్ట్రీలో వేడెక్కిస్తోంది. ఇన్నాళ్లు ఆయన తెరపై కథానాయకుడి చేత బలమైన పంచ్ డైలాగ్ లు పలికించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు.. అప్పుడప్పుడు అవసరం మేర పాటలు పాడారు.
బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కోసం గొంతు కలిపారు. కానీ ఏనాడూ పాటలు మాత్రం రాయలేదు. మొదటిసారి తనయుడు ఆకాష్ పూరి కోసం పాటల రచయితగా మారిపోయారట. ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ పేరు తో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరితో కలిసి చార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ పాదురి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా రిలీజైన రొమాంటిక్ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. అంతేకాదు వరుస పోస్టర్లతో సినిమా మీద అంతకంతకు హీట్ పెంచుతున్నాడు పూరి. నువ్వు నేను ఈ క్షణం అనే పాటని ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేశారు. అయితే మనకు ఇంత వరకే తెలుసు.. ఈ పాటకు ఉన్న అసలు విశేషం తాజాగా బయటపడింది. ఈ పాటను తనయుడి కోసం స్వయంగా పూరి జగన్నాథ్ రాసారట.
హీరో.. హీరోయిన్ల ను తన సినిమాల్లో సాధ్యమైనంత రొమాంటిక్ గా చూపించే పూరి తన పాటతో మరింత రొమాంటిక్ ట్రీట్ ని ఇస్తున్నారట. నార్త్ హాటీ కేతికా శర్మ ఈ పాటలో తన అందాల్ని యూత్ కి ఎరగా వేయబోతోందట. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని కొత్త సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. పూరీ ఇలా కలాన్ని ఝలిపించి యుగల గీతాల్ని.. ప్రణయ గీతాల్ని తనదైన శైలిలో రాసేస్తుంటే ఇక మిగతా గీత రచయితల సంగతేంటి పూరీ గారు అంటూ కామెంట్స్ పడుతున్నాయి. నిజంగానే పూరి డైలాగ్స్ మాదిరిగా సాంగ్స్ కూడా పాపులర్ అయితే ఇక మీకంటే తోపెవడు ఉండడు.