గతి ఏడాది స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ఇరగదీసాడు ఈ సినిమాలో... సుకుమార్ కూడా పాత్రకి తగ్గా నటి నటులను ఎన్నుకున్నాడు.. ఎవరికీ వారు వాళ్ళ పాత్రలలో జీవించేసారు... రామ్ చరణ్ ఈ సినిమాలో చెవిటి వాడిలా నటించి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు...

 

మ్యూజిక్ కూడా బాగా కనెక్ట్ అయింది.. సమంత, అనసూయ, జగపతి బాబు, నరేష, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్ ఇలా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసారు.. గత ఏడాది మార్చ్ నెలలో ఈ సినిమా థియేటర్ లో సందడి చేసింది.. కలెక్షన్స్ పరంగా బాగా వసూలు చేసింది..

 

దాదాపు 120కోట్ల రూపాయల షేర్ రాబట్టిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్ నమోదు చేసింది. 80ల కాలంనాటి ఒక పల్లెటూరి రివేంజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. పల్లెటూరు వాతావరణం, అక్కడ రాజకీయాలు గూర్చి బాగా తెరకెక్కించారు... కాగా నిన్న చెన్నై వేదికగా జరిగిన సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2019 లో ఈ చిత్రం సత్తా చాటింది.

 

రంగస్థలం ఏకంగా ఐదు విభాగాలలో అవార్డ్స్ గెలుచుకుంది... అందరి ప్రశంసలు పొందింది ఈ చిత్రం. బెస్ట్ యాక్టర్ గా 'రాంచరణ్ 'కి అవార్డు వచ్చింది... అలాగే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 'దేవిశ్రీ ప్రసాద్' కి అవార్డు వచ్చింది... రంగస్థలం పాటలు ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. జిల్ జిల్ జిగేలు రాణి అన్న పాటకు ప్రేక్షకులు సైతం జిల్ జిల్ జిగా అయిపోయారు... బెస్ట్ సపోర్టింగ్ రోల్ 'అనసూయ భరద్వాజ్'  కి వచ్చింది..అనసూయ రంగస్థలం సినిమాలో రంగంఅత్త గా బాగా నటించింది... బెస్ట్ లిరిసిస్ట్ 'చంద్ర బోస్', బెస్ట్ సినిమాటోగ్రాఫర్ 'రత్న వేలు' రంగస్థలం చిత్రం నుండి అవార్డ్స్ అందుకున్నారు.

 

ఒక సినిమాకి గాను 5 అవార్డులు అందుకున్నారు. దీనితో చిత్ర నిర్మాతలు మరియు దర్శకుడు సుకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డ్స్ గెలుచుకున్న వీరందరూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి: