అవును.. బ్యూటీ పూజా హెగ్డే కు తక్కువ సమయంలో ఎక్కువ ఇమేజ్ వచ్చింది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. క్షణం తీరిక లేకుండా ఉంది. వరుస అవకాశాలు వస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఇమేజ్ సంపాదించుకున్న నాయిక పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిత్రాలు చేసేస్తుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పూజకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అల్లు అర్జున్ సరసన పూజ నటించిన `అల వైకుంఠపురములో..` జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక, అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా పూజ నటిస్తోంది. ఇది వేసవిలో విడుదల కాబోతోంది. అలాగే, ప్రభాస్ చిత్రం ‘జాన్’ లో కూడా పూజ హీరోయిన్‌గా నటిస్తోంది. అది కూడా వచ్చే ఏడాది విడుదల. 

 

ఇక, ఇటీవల పూజ నటించిన `హౌస్‌ఫుల్-4` విజయవంతం కావడంతో బాలీవుడ్ నుంచి పూజకు రెండు అవకాశాలు వచ్చాయట. ఆ రెండు చిత్రాలూ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ ఏడాది పూజ నటించిన మూడు చిత్రాలు ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘హౌస్‌ఫుల్-4’ విడుదలయ్యాయి. ‘హౌస్‌ఫుల్‌ 4’ లో పూజాది చిన్న పాటి పాత్రే అయినా మెప్పించింది. తాజాగా బాలీవుడ్‌లో మరో రెండు చిత్రాలు చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని పూజా హెగ్డే వెల్లడించింది.

 

 “అవును. నేను బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేసేందుకు అంగీకరించాను. అందులో ఒకటి సాజిద్‌ నదివాయాలా ప్రొడక్షన్‌లో రూపొందనున్న సినిమా. మరొక సినిమా గురించి నేను ముందుగా చెప్పడం సరికాదు. నేను చేస్తున్నవాటిలో అదొక అద్భుతమైన సినిమా. ఆ ప్రాజెక్టు గురించి ఫిల్మ్‌మేకర్లు త్వరలో ప్రకటిస్తారు” అని పేర్కొంది పూజా. హిందీలో ఈమె తొలిసారిగా ‘మొహంజో దరో’ సినిమాతో ప్రవేశించింది. తర్వాత తెలుగు చిత్రాల్లో వరుస పెట్టి విజయాలను నమోదు చేసుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇమేజ్!? మాత్రం పూజ సొంతమైంది!? ఏమంటారు?!

మరింత సమాచారం తెలుసుకోండి: