టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరుపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు పెరుగుతున్నాయి. అలానే ఇటీవల భరత్ అనే నేను,మహర్షి సినిమాల సూపర్ సక్సెస్ లతో మంచి జోరుమీదున్న సూపర్ స్టార్ మహేష్, తప్పకుండా ఈ సరిలేరు మూవీతో హిట్ కొట్టి, హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం ఖాయం అని మహేష్ ఫ్యాన్స్ కూడా గట్టిగా భావిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్, కూడా సినిమా సక్సెస్ పై అందరిలో మంచి పాజిటివ్ ఫీల్ తీసుకురావడం జరిగింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి

 

భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మంచి ఆకట్టుకునే కథని, ఆకస్తికరమైన కథనంతో తెరకెక్కించడంలో పేరు సంపాదించిన అనిల్ రావిపూడి, ఈ సినిమాలో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు కూడా సమపాళ్లలో జోడించినట్లు సమాచారం. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ముఖ్యమైన ట్రైన్ ఎపిసోడ్, దాదాపుగా 35 నిమిషాలపాటు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుందని, అలానే దానికి ధీటుగా, సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేలా ఎలుక ఎపిసోడ్ 15 నిమిషాల పాటు సాగనుందని అంటున్నారు. 

 

ఇక సినిమా ప్రారంభం నుండి ముగిసే వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ కామెడీ డైలాగ్స్, అలానే మహేష్ బాబు పంచెస్ తో పాటు సుబ్బరాజు, వెన్నెల కిషోర్కామెడీ సెకండ్ హాఫ్ లో ఎంతో బాగుంటుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మాదిరిగానే సెకండ్ హాఫ్ కూడా మంచి హిలేరియస్ గా సాగనుందని అంటున్నారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ, దర్శకుడు అనిల్ గారు ఎలుకతో కామెడీ చేయించారంటే, ఆయన సామాన్యుడు కాదు అంటూ ఒకింత సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: