సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో మొద‌లైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తుండడంతో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మరింత హైప్ ఏర్పడింది. 

 

మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి పాల్గొంటున్న ఈ వెంట్ కావడంతో మీడియా కూడా భారీగా దృష్టి సారించింది. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకీవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా చిరంజీవి, మహేష్ సాంగ్స్ మెడ్లీతో అదరగొట్టాడు. మెగా - సూపర్ ఈవెంట్ గా పేరు పెట్టిన‌ ఈ ప్రోగ్రామ్ ని చూడడం కోసం హైదరబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల లోని అనేక ప్రాంతాల నుంచి మహేశ్ బాబు, చిరంజీవి అభిమానులు పొటెత్తారు. ఇలా అటు మెగా అభిమానులు, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తుండడంతో ఎల్బీ స్టేడియం కోలాహలంగా మారింది. అంతేనా ఇద్ద‌రి హీరోల అభిమానుల‌తో  ఎల్బి స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పాలి. 

 

అయితే ఈ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన అభిమానుల బ‌ట్టే ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుందని అర్థం అవుతోంది. మ‌రో వైపు వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న సూపర్‌ స్టార్ మహేష్ బాబు మ‌రియు  అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్ లు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. కాగా, ముందు నుండీ సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రమోషన్స్ విషయంలో కానీ మరెందులోనైనా కానీ పక్కా ప్రణాళికతో వెళుతున్నారు. షూటింగ్ ను కూడా చాలా త్వరగా ముగించేశారు. సెన్సార్ కూడా 9 రోజుల ముందర చేయడంతో ఇక రిలీజ్ కు సర్వం సిద్ధమైపోయినట్లే.  ఇక‌ ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: