జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అనగానే పంచులకు పంచెలు ఊడదిస్తాడు. జబర్దస్త్ షో లో ఆది పంచులకు తట్టుకోవడం అంత ఈజీకాదు. ఏ టాపిక్ తీసుకున్న ఆయన పంచులు తుపాకీ గుండ్లలా పేలుతూనే ఉంటాయి. ఇక ఈయన వేసే పంచులు అప్పుడప్పుడు వివాదాలకు దారి తీస్తాయని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇటీవల ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే షోలో, యాంకర్లను ఉద్దేశిస్తూ వారిని గ్రామవాలంటీర్లతో పోల్చుతూ ఆది చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. అంతే కాకుండా హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై ఏపీలోని గ్రామవాలంటీర్లు భగ్గున మండుతున్నారు.

 

 

ఇకపోతే ఇదే షోలో అనగా ఆడవారి పార్టీలు అర్థాలే వేరులే ప్రోగ్రాంలో హైపర్ ఆది వేసిన పంచులకు వీపు పగిలిపోయింది. అదేలా అంటే ఇదంతా ఆది స్వయంకృతాపరాధం అని చెప్పవచ్చూ. ఇక  ఆడవారి పార్టీలు అర్థాలే వేరులే షోలో రోజా, వర్షిణితో కలిసి తనకు కొత్త సంవత్సరంలో కేవలం 20 సంవత్సరాలు వస్తాయని జోక్ చేస్తే...హైపర్ ఆది వీరి మాటల మధ్యలో కల్పించుకొని ఇద్దరికీ రెండు సంవత్సరాల తర్వాత షష్టి పూర్తి అవుతుందని ఆ తర్వాత తాను వస్తానని పంచ్ వేశాడు.

 

 

దీంతో సీరియస్ అయిన రోజా పక్కనే ఉన్న హైపర్ ఆది వీపుపై గట్టిగా దెబ్బ వేసింది. దీంతో హైపర్ ఆది ఖంగుతిన్నాడు. అంతే కాదు ఇదే షోలో హైపర్ ఆది రెచ్చిపోయి పంచులు వేశాడు. అందులో ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు కొత్త సంవత్సరంలో మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశ ఉందని పరోక్షంగా సిగ్నల్స్ కూడా ఇచ్చేశాడు.

 

 

ఇదే కాకుండా ఈ షో కేవలం కిట్టీ పార్టీ లాంటిదని అదేమీ, పొలిటికల్ పార్టీ కాదని చెప్పేశాడు. ఇదిలా ఉండగా  నాగబాబు జబర్దస్త్ షో లో జరిగిన విభేదాలవల్ల ఈ షో నుండి వెళ్లిపోవడం తో, ప్రస్తుతం రోజానే ఈ షోకు రాజు, మంత్రి అంటూ మరో పంచ్ వేశాడు... ఇలా హైపర్ ఆది తన మాటలతో కొత్త సంవత్సరం స్పెషల్ ప్రోగ్రామ్ లో రెచ్చిపోయాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: