సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఎంత వైభవంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏపిలో కోనసీమలో సంక్రాంతి పండు ప్రత్యేక వాతావరణం నెలకొంటుంది.  మరికొన్ని ప్రాంతాల్లో పందాల జోరుతో పగలూ, రాత్రి తేడా లేకుండా ఆనందోత్సాహాల మద్య జరుపుకుంటారు. అయితే ప్రతి సంక్రాంతికి సినిమా పండుగ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సంక్రాంతి పండుగ సంర్భంగా మూవీలు రిలీజ్ కి సిద్దంగా ఉంటాయి.  ఈ సంక్రాంతి బరిలో దర్భార్, సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా మూవీలు సిద్దంగా ఉన్నాయి.  ఇప్పటికే అన్ని మూవీల చిత్ర యూనిట్స్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.  నిన్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.  అలాగే నిన్న ఉదయం అనీల్ రావిపూడి ఇంట మరో సంతోషకరమైన వార్త వినిపించింది.. ఆయన ఇంటికి బుల్లి వారసుడొచ్చాడు.  

 

ఇలా వరుసగా అన్నీ దర్శకుడికి అనీల్ రావిపూడికి కలిసి వచ్చాయి. అంతే కాదు నిన్న మూవీ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు.  దాంతో ఈ దర్శకుడి ఆనందానికి అవథులు లేకుండా పోయాయి.. స్టేజ్ పై ఎంతో ఎమోషన్ అయ్యాడు. తాను సినీ పరిశ్రమలోకి రావడానికి ముఖ్య ఇన్స్ ప్రేషన్ చిరంజీవి గారే అని చెప్పారు. ఆయన్ని చూసి డ్యాన్స్ నేర్చుకున్నానని స్కూళ్లో చిరు పాటలపై డ్యాన్స్ చేస్తే బహుమతులు వచ్చేవని అన్నారు.  ఇదిలా ఉంటే చిరంజీవి తన ప్రసంగం చివరలో.. సరిలేరు నీకెవ్వరు మూవీతో పాటు సంక్రాంతికి రాబోతున్న ఇతర సినిమాలు అల వైకుంఠపురములో కూడా మంచి విజయం సాధించాలని కోరారు.అతే సమయంలో చిరు చెవిలో దర్భార్ మూవీ ఉందని అన్నారు.. అప్పుడు వెంటనే మా ఫ్రెండ్ రజినీ దర్భార్ మూవీ కూడా రిలీజ్ అవుతుందని అన్నారు.

 

ఇదే సంక్రాంతికి దర్భార్ కూడా వస్తుందని చిరుకి చెవిలో చెప్పిన అనీల్ రావిపూడి తన మొదటి హీరో సినిమాని మరచిపోయాడు. ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో వివరణ ఇచ్చాడు. వర్క్ పరంగాను, పర్సనల్‌గాను నిన్న నాకు చాలా ఎమోషనల్ డే.  ఈ కంగారులో నా ఫస్ట్ హీరో కళ్యాన్ రామ్ గురించి నేను చెప్పడం మర్చిపోయినందకు చాలా బాధపడ్డానని అన్నారు. ఎంతమంచి వాడవురా చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అనీల్ రావిపూడి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: