కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా  ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం  '96'. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన  ఈ చిత్రం 2018లో విడుదలై  సూపర్ హిట్  అయ్యింది. ఇప్పుడు  ఈ కల్ట్ మూవీని  తెలుగులో  రీమేక్  చేస్తున్నారు. ఈ చిత్రంలో  ట్యాలెంటెడ్ హీరో  శర్వానంద్, స్టార్ హీరోయిన్  సమంత జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. 
 
 ఈ చిత్రానికి  జాను అనే టైటిల్ ను పెట్టనున్నట్లు  ఎప్పటినుండో  ప్రచారం జరుగుతూవస్తుంది.  అయితే మేకర్స్ మాత్రం  దీనిని అధికారికంగా ప్రకటించలేదు. ఇక  రేపు ఈ టైటిల్ విషయంలో క్లారిటీ రానుంది.  ఈచిత్రం యొక్క టైటిల్ తోపాటు  ఫస్ట్ లుక్ ను రేపు ఉదయం 10గంటలకు విడుదలచేయనున్నారు.  ఒరిజినల్ వెర్షన్ ను   డైరెక్టర్ చేసిన ప్రేమ్  కుమారే ఈ రీమేక్ కు దర్శకుడు కాగా  గోవింద్ వసంత  సంగీతం అందిస్తున్నాడు. వీరిద్దరికి తెలుగులో ఇదే మొదటి చిత్రం.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యానర్ పై  దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం ఫిబ్రవరి లో విడుదలకానుంది. 
 
ఇక  శర్వా ప్రస్తుతం  శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు.  నూతన దర్శకుడు  కిషోర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో  గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్  హీరోయిన్ గా నటిస్తుంది. రైతుల  సమస్యల నేపథ్యం లో  రూపొందుతున్న  ఈ చిత్రాన్ని  14రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపించంద్ ఆచంట నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్  సంగీతం అందిస్తున్నాడు.  ఈచిత్రం సమ్మర్ లో విడుదలకానుంది. అయితే సమంత మాత్రం 96 రీమేక్ తరువాత  ఇంతవరకు   తెలుగులో  మరో సినిమాను  సైన్ చేయలేదు. ప్రస్తుతం  ఆమె  సూపర్ హిట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో  నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: