టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా అక్కినేని సుశాంత్, నివేత పెత్తురాజ్, మురళి శర్మ, సునీల్ జయరాం, రాహుల్ రామకృష్ణ, నవదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ఇప్పటివరకు సినిమా పై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఇకపోతే నేడు కాసేపటి క్రితం ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. 

 

స్టైలిష్ యాక్షన్ సీన్స్, విజువల్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ తో అదరగొట్టిన ఈ ట్రైలర్ పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 'నాకొడుకు ఎక్కడున్నా రాజే, మనకి లక్ష పనులు కోటి వరీస్ ఉంటాయి, తలవంచుకు వెళ్ళిపోవాలి అంతే' అంటూ హీరో తల్లి, తండ్రుల బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇక 'చిన్నప్పటి నుండి నా లైఫ్ లో ఆహా అనుకున్న ఒక్కరోజు కూడా లేదు',  'దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్, ఒకటి నేలకి, మరొకటి వాళ్ళకి' అంటూ హీరోయిన్ పూజని చూపిస్తూ ఆడవాళ్ళని ఉద్దేశించి చేప్పే డైలాగ్ తో పాటు , 

 

ట్రైలర్ చివర్లో 'దీనికి విజిల్ ఒక్కటే సరిపోదు, బద్దలైపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లోకి కోట్ ఎగరడం వంటి చాలా స్పెషల్ ఎఫెక్ట్ లు ఉన్నాయి, నేను ప్లాన్ చేస్తాను' అంటూ పలికే డైలాగ్స్ , రేపు సినిమా రిలీజ్ తరువాత థియేటర్లో బన్నీ ఫ్యాన్స్ ని విజిల్స్ వేయించడం ఖాయం అనే చెప్పాలి. ఇక ఓవర్ అల్ గా ఈ ట్రైలర్ ప్రస్తుతం మంచి వ్యూస్ తో అలానే లైక్స్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా 12వ తేదీన వరల్డ్ వైడ్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: