'నా పేరు సూర్య' డిజాస్టర్ కావడంతో ఆయన అభిమానులు నిరాశ చెందిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న బన్నీ ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా పట్టుబట్టి త్రివిక్రమ్ తో సినిమాను పట్టాలెక్కించాడు.అలా తెరకెక్కిన సినిమానే  'అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర ను పోషిస్తోంది. 

 

ఈ సినిమాకు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం  బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ దాగుడుమూతలు ఆడుతున్నారు. 

 

ముందుగా ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలని  చేశారు. ఈ సినిమాకు పోటీగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు  సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో  నిర్మాతలు టెన్షన్ పడ్డారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకు పోటీ పడ్డాయి.ప్రమోషన్స్ విషయం లోను వెనక్కి తగ్గలేదు  దాంతో నిర్మాతలు కూర్చొని చేర్చించి ఒక సంధిని కుదిర్చారు. దాంతో మహేష్ సినిమా ఒక రోజు ముందుకు వెళ్ళింది. 

 

తాజాగా మహేష్ సినిమా కంటే ముందే రావాలని బన్నీ రిలీజ్ డేట్ మార్చాడని తెలుస్తుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న అల వైకుంఠపురంలో సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. కాగా రిలీజ్ డేట్ విషయంలో అభిమానుల్లో కాస్త నిరాశగా ఉన్న సమయం లో ఈ సినిమా లోని టైటిల్ సాంగ్ కు సంబందించిన ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది...

మరింత సమాచారం తెలుసుకోండి: