సాధారణంగా యాంకర్లు తమ వరకు ఎవరైనా కంటిస్టెంట్స్ వచ్చినా.. ఆడియన్స్ వచ్చిన వారితో చిలిపి ప్రవర్తించడం.. ప్రశ్నలు వేయడం కామెడీ చేయడం జరుగుతుంది..కానీ ఎప్పుడు ఫిజికల్ గా టచ్ చేసిన సంఘటనలు లేవు.  తెలుగు లో యాంకర్ సుమ, అనసూయ, రష్మి, శ్రీముఖి లాంటి హేమా హేమీలు ఇలాంటి సంఘటనలకు ఎప్పుడూ పాల్పపడలేదు.  తోటి యంకర్లతో.. ఆడియన్స్ తో జాగ్రత్తగానే ఉండేవారు. ఈ మద్య జబర్ధస్త్ లో ఉన్న యాంకర్లు సినిమాల్లో బిజీ అవుతున్న విషయం తెలిసిందే.  ఇక పటాస్ లో యాంకర్ గా చేసిన శ్రీముఖి ఆ మద్య ‘బిగ్ బాస్ 3 ’ సీజన్ లో దుమ్మురేపింది.  ఒకదశలో ఈ అమ్మడికే ఫ్రైజ్ వస్తుందని భావించారు.. కానీ సింగర్ రాహూల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 విన్నర్ అయ్యారు.

 

 ప్రస్తుతం పటాస్ లో శ్రీముఖి తప్పుకోవడంతో చలాకీ చంటి కంటిన్యూ చేస్తున్నారు.  అయితే తెలుగు బుల్లితెరపై శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి  యాంకర్స్ మధ్య పేరు తెచ్చుకోవాలంటే అంత సులభం కాదు.  ఈ కారణంతోనే  వర్షిణి సౌందరరాజన్ పటాస్ షోలో అరాచకం చేస్తుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి ప్రయత్నిస్తుంది.  మొన్నటికి మొన్న షో జరుగుతున్న సమయంలోనే అభిమానిని స్టేజీపైకి పిలిచి బుగ్గ కొరికింది.  ఇంకేముంది ఇది కాస్త  వైరల్ అయింది. ఎవరైనా యాంకర్లు ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పడానికి నిలుచున్న అబ్బాయిని చూసి అబ్బా ఎంత క్యూట్‌గా ప్రశంసిస్తారు. కానీ ఈ అమ్మడు స్టేజ్ పైకి పిలిచి  అంతా చూస్తుండగానే ఆ అబ్బాయి బుగ్గను గట్టిగా కొరికేసింది.

 

ఆ తర్వాత హైపర్ ఆదిని ఎత్తుకుని పైకి లేపి గిరాగిరా తిప్పేసింది. ఆదితో కూడా హద్దులు మీరి మరీ ఇష్టమొచ్చినట్లు చేస్తుందంటూ వర్షిణిపై సెటైర్లు పేలుతున్నాయి.  ఈ మద్య ఓ కార్యక్రమంలో అదితో సైతం హద్దులు దాటి ప్రవర్తించిందని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా మరో పటాస్ షోలో అమ్మాయిల బుగ్గలు కొరుకుతూ పిచ్చి పని చేసింది. చేతిలో పూలు అమ్ముకుంటూ బుగ్గలు కొరుకుతూ ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేసింది వర్షిణి. ఇలా బుల్లితెరపై వింత ప్రవర్తనలు చేస్తే విమర్శల పాలు కావడం అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: