జులాయి, సనాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ట్రైలర్ సిని ప్రియులను అలరించింది. అసలు అబద్ధమే ఆడని హీరో వైకుంఠపురములో లాంటి ఇంట్లో అక్కడ వారి మనసులు ఎలా గెలిచాడు అన్నది సినిమా కథ. సినిమా ట్రైలర్ చూస్తే మరోసారి త్రివిక్రం పెన్ పవర్ ఏంటో తెలుస్తుంది. 

 

అయితే ట్రైలర్ లో సినిమా కథను.. త్రివిక్రం డైలాగులను ఏమాత్రం రివీల్ చేయలేదని చెప్పొచ్చు. అందుకే ట్రైలర్ జస్ట్ ఓకే అనేలా ఉంది. ముఖ్యంగా త్రివిక్రం మార్క్ క్లాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెప్పొచ్చు. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండగా పోటీగా వస్తున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ మాత్రం చూడగానే నచ్చేలా ఉంది. అందుకే ఆ సినిమాకు పోటీగా వస్తున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఎలా ఉండబోతుందో చూడాలి.

 

సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ కాగా నివేదా పేతురాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. సీనియర్ యాక్ట్రెస్ టబుకి మంచి పాత్రే పడ్డదని తెలుస్తుంది. అల వైకుంఠపురములో ట్రైలర్ లో చూపించింది కొంతే అయినా తప్పకుండా త్రివిక్రం ఈసారి అందరి అంచనాలను అందుకుంటాడని అనిపిస్తుంది. ఇక సినిమాకు థమన్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. మ్యూజిక్ పరంగా అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని అంటున్నారు. మరి ఈ సినిమా రేంజ్ ఏంటన్నది మరో 5 రోజుల్లో తెలుస్తుంది. మ్యూజిక్ లవర్స్ కు ఈ సినిమా చాలా స్పెషల్ కానుందని తెలుస్తుంది. మ్యూజిక్ కాన్సర్ట్ లో త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన తమన్ తో పాటుగా సింగర్స్ గురించి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: