సక్సెస్ ఫుల్  హీరో మహేష్ బాబు.. సక్సెస్ ఫుల్  దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. కారణం వరుస విజయాలతో దూసుకుపోతూ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించేలా సినిమాలను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం.. వరుస సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్న మహేష్ బాబు హీరోగా నటించడం... యూత్ అందరినీ ఆకర్షిస్తూ దూసుకుపోతున్న రష్మిక మందన్న హీరోయిన్ పాత్రలో నటించటం... అన్నింటికీ మించి పదమూడేళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తూ ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండడం.. ఇలా ప్రతి విషయంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా

 

 

 ఇక పోతే ఈ సినిమాలో విజయశాంతి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తూ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే విజయశాంతిని మళ్లీ సినిమాల్లోకి తీసుకు రావాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నించినప్పటికీ.. అది అనిల్ కపూర్ కి మాత్రమే సాధ్యమైంది. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు కోసం రాసుకున్న కథలో  ఆ పాత్రకు విజయశాంతి అయితేనే సరిగ్గా సెట్ అవుతుందని భావించారు. దీంతో విజయశాంతిని  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేలా అనిల్ రావిపూడి ఒప్పించారు. ఇకపోతే ప్రస్తుత జనరేషన్ లో సీనియర్ నటిమణులకు  చాలా క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ రమ్యకృష్ణ విభిన్నమైన రోల్స్ చేసుకుంటూ దూసుకుపోతుంది. 

 

 

 రెమ్యూనరేషన్ విషయంలో కూడా సీనియర్ నటీమణులు హీరోయిన్లకు మించి  డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం విజయశాంతి కూడా భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించడానికి 2.5 కోట్లు విజయశాంతి డిమాండ్ చేయగా చివరికి 1.5 కోట్ల వరకు తెగ్గోట్టేసారట నిర్మాతలు . దీంతో ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాకు  టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మాత్రం కేవలం ఒక కోటి వరకు మాత్రమే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: