ముకుంద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే, అవకాశాలు లేకపోయిన తన అందాలతో బిజిగా మారిన ఈ ముద్దుగుమ్మ 'అరవింద సమేత'తో హిట్ కొట్టింది. అంతేకాదు.. ఆ మధ్య విడుదలైన మహేష్ 'మహర్షి'తో కూడా మంచి విజయం అందుకుంది. దీంతో ఊపుమీద వున్న పూజ, తాజాగా కుర్రకారు మతులు పోగొట్టడానికి. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో పలకరించబోతుంది..

 

 

ఇక ఇదిలా ఉండగా ముఖ్యంగా బన్నీతో చేసిన డీజే మూవీ సక్సెస్ ఆమెకు మంచి డిమాండ్‌ను తెచ్చిపెట్టింది. అప్పటి నుండి వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోన్న పూజా హెగ్డే సంక్రాంతి కానుకగా రానున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రం పై  ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉందట. ఇకపోతే ఇప్పుడు పూజాకు బాలీవుడ్‌ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయట. అయితే విజయాలు పెరిన కొద్ది హీరోయిన్స్ పారితోషికాలు పెంచడం మామూలే అదె పనిని ఇప్పుడు 4 సినిమాలతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న తరువాత పూజా హెగ్డే చేసిందట.

 

 

అదేమంటే ప్రస్తుతం తన రెమ్యునరేషన్‌ పెంచినట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తున్న ‘మేజర్’ అనే సినిమా కోసం ఆ చిత్ర బృందం పూజా హెగ్డేను హీరోయిన్‌గా నటించాల్సిందిగా అడిగారట. అయితే ఇప్పటివరకు రూ.1.5కోట్ల నుండి 2 కోట్లు మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా రూ.2.5 కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తోందట.

 

 

అయితే ఈ అందాల సుందరికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో కొందరు చిత్ర దర్శకనిర్మాతలు, ఆమె చెప్పిన రేటుకు తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారట. కానీ మహేష్ బాబు మాత్రం పూజా ప్లేస్‌ను వేరే హీరోయిన్‌తో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇకపోతే ఈమె చెప్పిన రెమ్యునరేషన్‌ విషయంలో మహేష్ బాబు కాస్త ఇబ్బంది పడ్డట్లుగా కొందరు అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: