యువ హీరోలు  సందీప్ కిషన్ ,సాయి తేజ్ లతో నక్షత్రం అనే సినిమా తెరకెక్కించి  దారుణమైన ప్లాప్ ను ఖాతాలో వేసుకున్న  క్రియేటివ్ డైరెక్టర్  కృష్ణవంశీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని గత ఏడాది చివర్లో  రంగ మార్తాండ తో మళ్ళీ మెగా ఫోన్   పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా  జరుగుతుంది.  విలక్షణ నటుడు  ప్రకాష్ రాజ్ ,కృష్ణ వంశీ సతీమణి  రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో  నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనసూయ, బిగ్ బాస్ 3 ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ , అలీ రెజా అలాగే  రాజశేఖర్ పెద్ద కుమార్తె  శివాని ముఖ్య పాత్రల్లో  నటిస్తున్నారు. ప్రస్తుతం  జరుగుతున్న షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 
 
ఇక తాజాగా ప్రకాష్ రాజ్ కుమారుడు కూడా  ఈషూటింగ్ లో  జాయిన్ అయ్యాడు. దానికి సంబంధించిన ఫోటో ను కృష్ణ వంశీ సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు. ఈ చిత్రం మరాఠా కల్ట్ మూవీ నట సామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఒరిజినల్ వెర్షన్ లో  నానా పటేకర్ లీడ్ రోల్  నటించగా మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేశాడు.  201ి6లో విడుదలైన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అనిపించుకుంది. మరి  తెలుగు లో రంగ మార్తాండ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. 
 
ఇక ఈ చిత్రం తో చాలా కాలం తరువాత  బ్రహ్మనందం సీరియస్ పాత్రలో  నటిస్తున్నాడు. రెడ్ బుల్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై అభిషేక్ జ్వకర్ , మధు కలిపు నిర్మిస్తున్న ఈ చిత్రం  సమ్మర్ లో విడుదల కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: