సూపర్ స్టార్ మహేష్ బాబు రష్మిక మందన్నలతో తో సరిలేరు నీకెవ్వరు సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు అనీల్ రావి పూడి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మొహానికి రంగేసుకున్నారు. అసలు సినిమాలే వద్దనుకున్న తరుణంలో అనూహ్యంగా సరిలేరుకి సరే అని షాకిచ్చారు. సంక్రాంతి సందర్భంగా 11 న సరిలేరు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక మహేష్ బాబు అభిమానుల్ని మెప్పించే అంశాలు సరిలేరులో చాలా ఉంటాయట. అయితే వాళ్ల కోసమే కాకుండా ఒక బలమైన కారణం కోసం ఈ సినిమా చేశాడట అనీల్. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు రావిపూడి. గతేడాది ‘ఎఫ్‌2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈసారి సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్ళీ మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. 

 

ఇక ఈ సినిమాలో మహేష్ నాన్న గారు సూపర్ స్టార్ కృష్ణ కూడా తెరపై కనిపించి సర్‌ప్రైజ్ చేస్తారట. ఇక ఈ సినిమా ద్వారా ఒకప్పటి హీరోయిన్ సంగీత రీ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో సంగీత సంక్రాంతి, ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే వంటి చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించింది. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సరిలేరు తో రీ ఎంట్రీ ఇస్తుంది. అలాగే నిర్మాత కం ఆర్టిస్ట్ బండ్ల గణేష్ కూడా ఈ సినిమాతో మళ్ళీ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే అందరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని అనిల్ రావిపూడి తాజాగా వెల్లడించాడు. వాస్తవంగా విజయశాంతి రీ ఎంట్రీ మాస్ మహా రాజా రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా రాజా ది గ్రేట్ తోనే జరగాల్సి ఉండిందట. ఆ సినిమా కథ కూడా అనిల్ విజయశాంతికి చెప్పారట. కథ నచ్చింది గాని నాకు సినిమా చేసే ఆలోచన లేదని సున్నితంగా తిరస్కరించిందట.

 

అయినప్పటికి రావిపూడి ఎలాగైనా విజయశాంతి ని తన సినిమాలో నటింపజేయాలనుకున్నారట. అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమా అనుకోగానే వెంటనే తను రాసుకున్న భారతి పాత్రకు ఖచ్చితంగా విజయశాంతి తోనే చేపించాలని గట్టిగా డిసైడయ్యాడట. అందుకే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విజయశాంతికి సరిలేరు కథ వినిపించాడట. ఆమె పాత్ర కున్న ఇంపార్టెన్స్ ని చెప్పడంతో పాటు ఈ సినిమాలో హీరో సూపర్ స్టార్ మహేష్ అని చెప్పాడట. దాంతో ఒక్కసారిగా విజయశాంతికి మహేష్ నాన్నగారు కృష్ణ తనని హీరోయిన్ గా పరిచయం చేసిన విషయం గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యారట. అందుకే ఇక ఏమాత్రం ఆలోచించకుండా సరిలేరులో నటించడానికి విజయశాంతి ఒప్పుకున్నారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: