టాలీవుడ్ లో సంక్రాంతి వచ్చిందంటే చాలు పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో.. సినిమాలు కూడా అంతే అనందంగా చూస్తుంటారు.  ముఖ్యంగా సంక్రాంతి బరిలో తెలుగు లో పెద్ద హీరోల సినిమాల సందడి అంతా ఇంతా కాదు.  ఈ ఏడాది సంక్రాంతి బరిలో రజినీ దర్భార్, మహేష్ బాబు.. సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో, కళ్యాన్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే రజినీ దర్బార్ వచ్చేసింది. ఈ రోజు మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఈ మూవీ లో మొదటి నుంచి ఎండ్ వరకు కామెడీ తో మారు మోగుతుందని అంటున్నారు.సాధారణంగా చాలా సినిమాల్లో రైల్ ఎపిసోడ్స్ చూస్తూనే ఉంటాం.

 

కామెడీ బేస్ పై ఈ రైల్ ఎపిసోడ్స్ సాగుతుంటాయి.  తాజాగా సరిలేరు నీకెవ్వరు మూవీలో కూడా రైల్ ఎపిసోడ్ ఎంట్రటైన్ గా ఉందని అంటున్నారు.  అయితే 2004 రవితేజ నటించిన ‘వెంకి’ మూవీలో ట్రైన్ ఎపిసోడ్ పొట్ట చక్కలయ్యేలా ఉన్న విషయం తెలిసిందే.  రవితేజ ఆయన ఫ్రెండ్స్, ఏవీఎస్, బ్రహ్మానందంతో  రవితేజ చేసే కామెడీ.. మాస్టర్ భరత్ కూల్ డ్రింక్ లో మందు కలిపితే అది తాగి రచ్చ రచ్చ చేయడం.. తర్వాత వేణు మాధవ్ ఎంట్రీ మొత్తానికి సినిమా అంతటికి ఈ ఒక్క ఎపిసోడ్ హైలెట్ గా నిలిచింది. 

 

అప్పట్లో టివిల్లో ఈ కామెడీ బిట్స్ బాగా అలరించేవి. అయితే సరిలేరు నీకెవ్వరు మూవిలో కూడా ట్రైన్ సీన్ తో అలరించే ప్రయత్నం చేసినా.. అది కావాలని ఏదో పనికట్టుకొని కామెడీ ఉండాలనే ప్రయత్నం చేసినట్టు కనిపించింది.  బండ్ల గణేష్, హీరోయిన్ ఇక మహేష్ బాబు గతంలో ఈ టైప్ కామెడీ ఎప్పుడూ చేయలేదు. ఏది ఏమైనా గతంలో వెంకి సినిమా లోని ట్రైన్ ఎపిసోడ్ తో పోల్చితే ఇది పెద్దగా ఎంట్రాక్షన్ ఏమీ లేదని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: