ఇప్పటివరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు రెండూ కూడా మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించగా, సుశాంత్, నివేత పేతురాజ్ సునీల్, జయరాం, రాహుల్ రామకృష్ణ, నవదీప్, సముద్ర ఖని, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ కు విపరీతమైన స్పందన లభించి, సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. 

 

ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా యావరేజ్ టాక్ వినపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి వంటి సినిమాల కలబోతగా ఈ సినిమా తెరకెక్కిందని కొందరు ప్రేక్షకులు సినిమాపై అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బన్నీ మాత్రం తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడని, అలానే హీరోయిన్ పూజ కూడా ఎంతో అందంగా కనిపించడంతో పాటు మంచి అభినయానికి వీలున్న పాత్రలో నటించి మెప్పించిందట. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగిన ఈ సినిమా, అక్కడక్కడా కొంత ల్యాగ్ తో సాగినప్పటికీ ఇంటర్వల్ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుందని అంటున్నారు. 

 

ఇక ఒకింత మెల్లగా ప్రారంభం అయ్యే సెకండ్ హాఫ్ కూడా అదే మాదిరిగా సాగుతుందని, అక్కడక్కడా త్రివిక్రమ్ మార్క్ పంచెస్ బాగున్నప్పటికీ, ఆశించిన రేంజ్ లో అవి పేలలేదని అంటున్నారు. సాంగ్స్ విజువల్ గా పర్వాలేదని, యాక్షన్ సీన్స్ కూడా ఒకింత పర్వాలేదని, అయితే సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్ కు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుందని అంటున్నారు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ బాగుందని, క్లైమాక్స్ కూడా పర్వాలేదని, ఓవరాల్ గా ఈ సినిమా ఒక యావరేజ్ మూవీ గా నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక కొందరు బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం, ఇదేంటి బన్నీ ఇలా చేసావ్ అనేలా సినిమా సాగినట్లు తెలుస్తోంది. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: