స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, రాజేంద్రప్రసాద్, అమృతం ఫేమ్ హర్షవర్ధన్, సునీల్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు నుండి సానుకూలమైన టాక్ వినిపిస్తుంది.

 

ఊహించిన రీతిలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు సూపర్ గా ఉన్నాయ్ అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల్లోనే పది బ్రహ్మాండమైన డైలాగులు మనసుని నేరుగా తాకుతాయని తెలుస్తుంది. అదేవిధంగా అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందని సినీ అభిమానులు చెబుతున్నారు.


ఇక ఈ విషయం పక్కన పెడితే, ఈ చిత్రంలో సునీల్ పోషించినటువంటి సీతారామ్ పాత్ర హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఫ్రెండ్ సునీల్ కోసం ప్రత్యేకమైన హాస్య క్యారెక్టర్లను క్రియేట్ చేసి అతడి పాపులారిటీని తారా స్థాయికి తీసుకెళ్లారన్న సంగతి తెలిసిందే. అయితే, గతంలో లాగానే ఇప్పుడు సునీల్ నటించిన సీతారామ్ పాత్రని కూడా చాలా చక్కగా రూపుదిద్దాడు అని టాక్. అమృతం ఫేమ్ హర్షవర్ధన్-సునీల్ మధ్యసాగే సన్నివేశాలు నవ్వులను పూయిస్తాయని, అలాగే అల్లు అర్జున్ సునీల్ ల మధ్య ట్రాక్ మామూలు హాస్యభరితంగా లేదని ఆడియన్స్ పొగుడుతున్నారు.

 

 

బంక్ శీను ని మించి సీతారామ్ పాత్ర చాలా ఫన్నీ గా ఉందని అంటున్నారు పబ్లిక్. ఇకపోతే అల్లు అర్జున్ అభిమానులతోపాటు మిగతా అభిమానులు కూడా ఎక్కడా నిరాశ చెందకుండా ఈ సినిమా ఉందని పాజిటివ్ టాక్ గట్టిగా వినిపిస్తుంది. తమన్ మ్యూజిక్, పూజా హెగ్డే అందం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలంటే బొమ్మ బ్లాక్ బస్టరే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: