పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ అందరిలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నది.  వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన హవా నడిపిస్తోంది. ఓవైపు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా తన హవా నడిపిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది ఈ అమ్మడు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల అందరి మతి పోగొడుతునే...  మరోవైపు తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది అందాల ముద్దుగుమ్మ పూజా హిగ్డే . ప్రస్తుతం టాప్ హీరోలందరి సరసన ఛాన్స్ కొట్టేస్తుంది  . దర్శకనిర్మాతలు అందరికీ పూజా హెగ్డే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది ఈ అమ్మడు. ఇప్పటికే వరుస అవకాశాలను చేజిక్కించుకున్న ఈ అమ్మడు.. వరుస హిట్లు కూడా అందుకుంటుంది. 

 

 

 అయితే తాజాగా పూజా హెగ్డే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కు షాక్ ఇచ్చిందట.. పూజా హెగ్డే నమ్రతకు షాక్ ఇవ్వడం ఏంటి అంటారా.. అది తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే.. పూజా హెగ్డే అంతకు ముందు ఎంతో మంది హీరోల సరసన నటించినప్పటికీ ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది... ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసింది మహర్షి సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని సాధించింది ఈ అమ్మడు... ఇక ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన గద్దల కొండ గణేష్ సినిమాలో నటించి సూపర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది... ఇప్పటికే ఈ అమ్మడి ఖాతాలో హ్యాట్రిక్ విజయాలు పడిపోయాయి. హ్యాట్రిక్  దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం అలా వైకుంఠపురములో  సినిమాతో అల్లు అర్జున్ తో జోడీ కట్టి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

 

 

 అయితే గతేడాది మహేష్ బాబు సరసన  మహర్షి సినిమాలో నటించిన పూజ హెగ్డే కి మరోసారి మహేష్ బాబు సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఈ సారి మహేష్ బాబు హీరో కాదు నిర్మాత. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యానర్ లో ... వరుస విజయాలతో దూసుకుపోతున్న అడవి శేష్ హీరోగా వస్తున్న మేజర్ సినిమాలో పూజా హెగ్డే ని సంప్రదించారట మహేష్ బాబు సతీమణి నమ్రతా. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఏకంగా ఈ సినిమాకు రెండు కోట్లు డిమాండ్ చేసిందట పూజా హెగ్డే... దీంతో షాక్ అయిన మహేష్ బాబు సతీమణి నమ్రతా మిగతా నిర్మాతలతో చర్చించి పూజ కు మొండిచేయి చూపించిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: