యంగ్ హీరో నితిన్ ,ఛలో ఫేమ్  వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భీష్మ.  గత  కొన్ని నెలలుగా  నాన్ స్టాప్ గా  షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం  పూర్తి కావొచ్చింది.  ఈ చిత్రంలో కెజిఎఫ్ నటుడు అనంత్ నాగ్  కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆయన పాత్ర కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ చిత్రం యొక్కటీజర్  నిన్న విడుదలకాగా డీసెంట్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. కన్నడ  బ్యూటీ  రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం  అందిస్తున్నాడు.  సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న  విడుదలకానుంది.  కాగా లై , చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలతో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన నితిన్ భీష్మ పై  భారీ ఆశలు పెట్టుకున్నాడు. 
 
 
ఇక  నితిన్ ప్రస్తుతం ఈ సినిమాతోపాటు  మరో రెండు సినిమాల్లో నటిస్తూ  ఫుల్  బిజీ గా వున్నాడు.  అందులో  తొలిప్రేమ ఫేమ్  వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'రంగ్ దే'  ఒకటి.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో  నితిన్ సరసన కీర్తి సురేష్  హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు  సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి  డైరెక్షన్ లో కూడా నితిన్  ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ  చిత్రంలో నితిన్ కు జోడిగా  రకుల్ ప్రీత్ సింగ్ , మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.  భవ్య క్రియేషన్స్  పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా  ఈఏడాది లోనే విడుదలకానున్నాయి. ఈ సినిమాలను పూర్తి చేసిన తరువాత నితిన్ ,చల్ మోహన్ రంగ ఫేమ్  కృష్ణ చైతన్య డైరెక్షన్ లో పవర్ పేట లో నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: