యంగ్
హీరో నితిన్ ,ఛలో ఫేమ్
వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భీష్మ. గత కొన్ని నెలలుగా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పూర్తి కావొచ్చింది. ఈ చిత్రంలో
కెజిఎఫ్ నటుడు అనంత్ నాగ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆయన పాత్ర కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ చిత్రం యొక్కటీజర్ నిన్న విడుదలకాగా డీసెంట్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం
ఫిబ్రవరి 21న విడుదలకానుంది. కాగా
లై , చల్
మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలతో హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసిన
నితిన్ భీష్మ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.