టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిరో గా, పూజా హెగ్డే హిరోయిన్ గా జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సంద‌డి చేస్తోంది. దీంతో ఇక సంక్రాంతి పండగ వేళ సినిమా థియేటర్ లు కళకళ లాడుతున్నాయి. 

 

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. అంచనాలకి తగ్గట్టు గానే సినిమా విడుదలైన అన్ని ధియేటర్ల నుంచి హిట్ టాక్ రావ‌డంతో వీరిద్ద‌రూ హ్యాట్రిక్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. మ‌రోవైపు థమన్ కంపోజ్ చేసిన మ్యూజికల్ ఆల్బమ్ లోని అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సినిమాకు బాగా ప్ల‌స్ అయింది. 

 

అలాగే అమెరికా, న్యూజిల్యాండ్‌ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్‌ తో రచ్చ చేస్తోంది. ఆ రెండు దేశాల్లో ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి.  ఇక అటు క్లాస్, ఇటు మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపించుకుంటున్న ఈ సినిమాకి ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ ప‌రంగా థియేట‌ర్లు ద‌ద్ద‌ రిల్లి పోతున్నాయి. 


అల వైకుంఠ‌పుర‌ములో ఫ‌స్ట్ డే.. 26.21 కోట్ల షేర్ తో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అనిపించు కోవడమే కాకుండా అల్ టైం ఫస్ట్ డే ఆంధ్ర – తెలంగాణ షేర్స్ లో 6వ స్థానంలో నిలిచింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: