స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటించారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు  రేపుతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన అన్నీ ఈ సినిమా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లారు అని వేరేలా చెప్పనక్కర్లేదు..

 

అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం  బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే..

 

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ ను అందుకుంది.. బన్నీ సినీ కెరియర్ ను ఎక్కడికో ఈ సినిమా తీసుకెళ్ళింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అందుకే ఈసినిమా ఈరోజు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అయింది..అలా సినిమా ఇప్పుడు మంచి హిట్ దాంతో పాటుగా ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి.. ఇకపోతే సినిమాలు ఈ రోజుల్లొ ఫ్యాన్స్ కు తగ్గట్లు ఉండటంతో ఈ గుర్తింపు వచ్చిందని టాక్..

 

మరి ఒక్క రోజులో ఎంత కలెక్షన్స్ రాబట్టింది చూస్తే..ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ‘అల వైకుంఠపురములో’ షేర్ రూ. 29.45 కోట్లు వసూలైంది. ప్రాంతాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో ‘అల వైకుంఠపురములో’ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.. నైజాం - రూ. 6.80 కోట్లు సీడెడ్ - రూ. 4.02 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 2.87 కోట్లు తూర్పుగోదావరి - రూ. 3.54 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 2.78 కోట్లు గుంటూరు - రూ. 5.11 కోట్లు కృష్ణా - రూ. 3.10 కోట్లు నెల్లూరు - రూ. 1.32 కోట్లు మొత్తం - రూ. 29.54 కోట్లు రాబట్టింది.. ఈ సంక్రాంతికి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు సినీ ప్రముఖులు..

మరింత సమాచారం తెలుసుకోండి: