టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒకింత మిశ్రమ స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు తన అద్భుత నటనతో ఈ సినిమాను ముందుకు నడిపించారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వచ్చిన ఈ పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ అయి, ఇప్పటికి మూడవ రోజు గడుస్తున్నప్పటికీ చాలా చోట్ల సినిమా బాగానే కలెక్షన్స్ రాబడుతున్నట్లు సమాచారం. 

 

అలానే మరొకవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా కూడా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా కూడా రిలీజ్ అయి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ చాలా ఏరియాల్లో ఇంకా మంచి కలెక్షన్స్ తోనే దూసుకువెళ్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు ఎక్కుగా బిసి సెంటర్స్ లో ఒకింత జోరుని చూపిస్తుంటే, 

 

అలవైకుంఠపురములో మాత్రం ఎక్కుగా ఏ సెంటర్స్ లో దున్నేస్తోందట. అందులోని మరొక మూడు రోజులు వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కావడంతో ఈ రెండు సినిమాలకు పెద్దగా ఢోకా ఉండదని, మొత్తంగా చూస్తే రాబోయే ఆదివారం వరకూ కూడా ఈ రెండు మంచి జోరుని చూపించే అవకాశం ఉందని, అయితే రాబోయే సోమవారం తరువాత గాని పూర్తి స్థాయిలో ఏ సినిమా ఎంతమేర కలెక్షన్స్ సాదిస్తుందనేది తేటతెల్లం అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: