చాలా రోజుల తర్వాత మరో మీటూ ఆరోపణ కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ బెంగాలీ బుల్లి తెరనటి రూపంజన మిత్రా.. తనను ఓ నిర్మాత లైంగికంగా వేధించినట్టు బయటపెట్టింది. రూపాంజన మిత్రా బెంగాలీలో పాపులర్ టీవీ ఆర్టిస్ట్. సిందూర్‌ ఖేలా’, సోతి, ఏక్ ఆకాశ్ వంటి సీరియళ్లు ఆమెకు బాగా పేరు తెచ్చాయి.

 

ఆమె తాజాగా ఇట్టిన ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ అరిందం బాగోతం వెల్లడించింది. రూపంజన నిర్మాత ఆరిందమ్ నిర్మించిన భూమికన్య ’ సీరియల్‌ కు నిర్మాతగా ఉన్నాడు. ఈ సీరియల్‌ మొదటి ఎసిసోడ్‌ కోసం స్క్రిప్ట్‌ చదవాలంటూ అరిందమ్‌ రూపంజనను తన ఆఫీసుకు రమ్మన్నాడట. రూపంజన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన ఆఫీసుకు వెళ్లిందట.

 

అక్కడకు వెళ్లాక కానీ ఆయన ఉద్దేశ్యం ఏంటో అర్థమైందట. ఎందుకంటే.. ఆ ఆఫీసులో ఆరిందం ఒంటరిగా ఉన్నారు. స్క్రిప్టు వినిపించే పేరుతో.. ఆరిందమ్ ఆమెను అసభ్యంగా తడమడం ప్రారంభించాడు. పై నుంచి కింద వరకూ నిమిరాడట. అతని చేష్టలతో మొదట సిగ్గుతో చచ్చిపోయిన రూపంజన ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని ముందు స్క్రిప్టు చెప్పండి అంటూ నిలదీసిందట.

 

మరి ఆ తర్వాత ఆరిందమ్ ఏం చేయాలనుకున్నాడో కానీ.. ఇంతలో.. ఆయన భార్య ఆఫీసుకు రావడంతో రూపంజనకు ముప్పు తొలగిపోయిందట. ఆ తర్వాత ఇంటికొచ్చిన తర్వాత రూపంజన బాగా ఏడ్చిందట. అయితే ఈ విషయం బయటకు చెప్పేందుకు అప్పట్లో ఆ సీరియల్ నిర్వాహకులతో ఒప్పందం అడ్డువచ్చిందట. సీరియల్ కు నష్టం చేకూర్చే విషయాలు బయటపెట్టకూడదన్నది ఆ ఒప్పందం.

 

అందుకే రూపంజన తాజాగా ఈ విషయాలు బయటపెట్టింది. అయితే ప్రొడ్యూసర్ ఆరిందమ్ మాత్రం రూపంజన ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఆమె అలా ఎందుకు చెప్పిందో నాకు తెలియదు.. మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొస్తున్నారు. పాపం.. మరి ఇంకేం చెబుతాడు.?

మరింత సమాచారం తెలుసుకోండి: