ఇద్దరు వ్యక్తులు మాట్లాడటం లేదు అంటే వారి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని అర్ధం చేసుకోవచ్చు. అదే ఇద్దరు వ్యక్తులు కొన్ని సందర్భాల్లో మాట్లాడి మరికొన్ని సందర్భాల్లో మాట్లాడకుంటే దాన్ని ఏమంటారో.. అంతేకాదు ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావిస్తే చాలు చెప్పను బ్రదర్ అని సీన్ సితార చేసేస్తారు. ఇంతకీ మాట్లాడి మాట్లాడుకుండా ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ చేస్తున్న ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరొకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

 

నేను మెగా ఎప్పటికి మెగా హీరోనే అంటూ చెప్పుకునే అల్లు అర్జున్ ఈమధ్య తనకంటూ ఓ ఆర్మీ ఉందని చెప్పాడు. ఇదిలాఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద ఫైర్ అవడం మనోడికి కామనే. అప్పట్లో ఓ ఈవెంట్ లో బన్ని మాట్లాడుతుంటే పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలేయడంతో చెప్పను బ్రదర్ అనేసి వారి కోపానికి బలయ్యాడు. అయితే పవన్ అంటే అసలు పడనట్టు ఉండే బన్ని ఈమధ్య జరిగిన కొన్ని విషయాల్లో అతనికి సపోర్ట్ గా నిలిచాడు. 

 

ఇదంతా బాగానే ఉండగా రీసెంట్ గా జరిగిన అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ అల్లరి తట్టుకోలేక మీరడుగుతున్నారు కాబట్టి పవర్ స్టార్ అంటున్నా అని ఆ వెంటనే చిరంజీవిపై తన అభిమానాన్ని చూపించాడు అల్లు అర్జున్.. ఇంతకీ పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ ఒపీనియన్ ఏంటన్నది మళ్లీ ఫ్యాన్స్ కు అర్ధం కాని ప్రశ్నగా మారింది. అందుకే అల వైకుంఠపురములో సినిమాను పికే ఫ్యాన్స్ బాయ్ కాట్ చేయాలని అనుకున్నారు. కాని సినిమాలో పవర్ స్టార్ గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పి వాళ్లని శాంత పరచాడు బన్ని.

 

ఫైనల్ గా అల వైకుంఠపురములో సక్సెస్ అవడంతో రెస్పెక్టెడ్ అల్లు అర్జున్ గారు అంటూ పవన్ ఓ స్పెషల్ గ్రీటింగ్స్ పంపించాడు.. దానికి అదేవిధంగా రెస్పాండ్ అవుతూ థ్యాంకూ పిఎస్పికే గారు అంటూ బన్ని రిప్లై ఇచ్చాడు. వెళ్లిద్దరి మధ్య జరుగుతున్న ఈ అర్ధం కాని ఓ గొడవ వల్ల మెగా అల్లు ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఇంతకీ అల్లు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకటయినట్టేనా లేక మళ్లీ ఇందులో ఏదైనా తిరకాసు ఉందా అన్నది తెలియాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: