తాజాగా అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ  హిట్ కాంబినేషన్లో తాజాగా అల వైకుంఠ పురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అల్లు అర్జున్ త్రివిక్రమ్. ఇక  ఈ సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రికార్డులు సృష్టించింది. ఇక సినిమా విడుదలైన తర్వాత భారీ రికార్డులను సృష్టిస్తోంది ఈ సినిమా. మొదట విడుదలైన ఈ సినిమా పాటలు  రికార్డు సృష్టించగా తాజాగా విడుదలైన ఈ సినిమా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 

 

 

 ఇక ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో విజయ విహారం చేస్తూ భారీ వసూళ్లు రాబడుతూ  దూసుకుపోతుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రజినీ దర్బార్మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఏకంగా అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబడుతుంది అలా వైకుంఠపురములో సినిమా. ఇక ఈ సినిమా సక్సెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది చిత్ర బంధం. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే. గతంలో అల్లు అర్జున్ పూజా హెగ్డే కాంబినేషన్లో దువ్వాడ జగన్నాథం సినిమా వచ్చింది. 

 

 

 కాగా దువ్వాడ జగన్నాథం సినిమా ఫ్లాప్ అయినప్పటికీ... తాజాగా వచ్చిన అలా వైకుంఠపురములో సినిమాతో ఈ జోడీకి హిట్ లభించింది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే తో మరోసారి కలిసి నటించాలని ఉంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు అల్లు అర్జున్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అల్లు అర్జున్.. నాకు పూజ తో మరో సినిమాలో నటించాలని ఉంది అంటూ చెప్పాడు. దీంతో అల్లు అర్జున్ తదుపరి సినిమాలో కూడా పూజా హెగ్డే కి ఛాన్స్ దక్కవచ్చు అని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: