దర్శక ధీరుడు ఎస్.సె.రాజమౌళి ఏ సినిమా తీసినా కనీసం రెండేళ్ళు సమయం తీసుకుంటారు. అయితే ఈ రెండేళ్ళు మాత్రం ఫ్యాన్స్ కి ఆతృఅత, పిచ్చి పీక్స్ లోకి వెళ్ళేలా చేస్తారు. ఎప్పుడెప్పుడు జక్కన్న సినిమా అప్‌డేట్ వస్తుందా వస్తే అది ఏంటా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక బాహుబలి ప్రాంచైజీ తర్వాత మళ్ళీ జక్కన్న తీస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల భారీ మల్టీస్టారర్ షూటింగ్ చివరి దశకు వచ్చినట్లే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

 

రాజమౌళి గతంలో ప్రకటించిన జులై 30న ఈ సినిమాని విడుదల చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఇక జక్కన్న ప్రతి సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరు సీట్ అంచున కూర్చొని ఊపిరి బిగపట్టి మరీ చూస్తారు.

 

ఇప్పుడు కూడా జక్కన్న గత సినిమాల మాదిరిగానే ఆర్.ఆర్.ఆర్ లో కూడా అద్బుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ ఉండబోతున్నట్లుగా సమాచారం. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. వారిద్దరు కలిసి అంటే అల్లూరి, కొమురం భీంలు కలిసి బ్రిటీష్ వారి పైకి యుద్దంకు వెళ్తారట. బ్రిటీష్ వారిని మట్టికరిపించడంతో ఇంటర్వెల్ పడుతుందట.

 

ఇంటర్వెల్ కు ముందు ఉండే ఈ 20 నిమిషాల భయంకరమైన యుద్ద సన్నివేశాల్లో అల్లూరి పాత్రలో చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ ను చూస్తూ ఉంటే అలాగే ఉండిపోవాలనిపించేలా ఉంటారట. ఆ సీన్స్ లో చరణ్, ఎన్టీఆర్ ల నటన, రౌద్రం సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆ యుద్ద సన్నివేశం తర్వాత ఇంటర్వెల్ పడుతుందట. ఈ సినిమా గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వస్తూ సినిమా అంచనాలు పెంచుతూనే ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ యుద్ద సన్నివేశం అంటూ వస్తున్న ఈ వార్తలు సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకు వెళుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: