స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ  అల.. వైకుంఠపురములో ఇటీవల విడుదలై  బ్లాక్ బాస్టర్  టాక్ తో  బాక్సాఫీస్ వద్ద  అదరగొడుతుంది.  ఈ చిత్రం  అన్నిసెంటర్ల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.  ఇక మూడో రోజు ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా  11.5కోట్ల షేర్ ను రాబట్టి  అదుర్స్ అనిపించింది. తద్వారా బాహుబలి 2 , సాహో తరువాత  మూడో రోజు 11 కోట్ల కంటే ఎక్కువ షేర్ ను రాబట్టిన చిత్రంగా  అల.. రికార్డు సృష్టించింది.
 
ఇక  మూడు రోజుల్లో ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో 48కోట్ల షేర్ ను రాబట్టి   ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70 శాతం  రికవరీ చేసింది. ఈరోజు కూడా అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతుండడం తో రేపటి కల్లా  ఈ చిత్రం చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. దాంతో  ఫుల్ రన్ లో ఈ చిత్రం 100కోట్ల క్లబ్ లో  చేరడం ఖాయం. అదే జరిగితే అల్లు అర్జున్ కు ఇదే మొదటి 100కోట్ల సినిమా కానుంది. 
 
 
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా టబు , జయరాం , మురళి శర్మ , సునీల్ , హర్ష వర్ధన్ ,నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు. ఇక బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు  వచ్చిన జులాయి , సన్ ఆఫ్ సత్యమూర్తి  సూపర్ హిట్లు  కాగా ఇప్పుడు  అల... వైకుంఠపురములోతో  ఈజోడి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: