దివంగత అతిలోక సుందరి శ్రీదేవి మరణించి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కూడా మన తెలుగు వారు సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరిచిపోలేకపోతున్నారు. హిందీ సహా దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటించడంతో పాటు స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి, తన పెద్ద కూతురైన జాహ్నవిని స్క్రీన్ పై హీరోయిన్ గా చూడాలి అనే కోరిక మాత్రం తీరకుండానే అనంతలోకాలకేగారు. ఆ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ సహా, ఆమె బిడ్డలైన జాహ్నవి, ఖుషి మాత్రం ఎప్పటికీ మరిచిపోలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇకపొతే ఆమె మరణాంతరం జాహ్నవి తన తొలి సినిమా దఢక్ ద్వారా బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

ఫస్ట్ మూవీ తో మంచి పేరు దక్కించుకున్న జాహ్నవి, ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇక ప్రస్తుతం గుంజన్ సక్సేనా అనే సినిమాతో పాటు రూహి అఫ్జానా, దోస్తానా 2 సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటిస్తున్న జాహ్నవి, ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ తన పర్సనల్ అలానే సినిమాల విషయాలు వారితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక తల్లి వలె మంచి అందగత్తె అయిన జాహ్నవి, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ని తరచూ ఫాలో అవుతూ పలు ఫోటో షూట్స్ కు ఫోజులిస్తూ ఉంటుంది. పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. 

 

ఇక నేడు లైట్ పర్పుల్ కలర్ పొట్టి గౌను వేసుకుని దిగిన ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది జాహ్నవి. అయితే ఆ ఫొటోలో ఆమెను చూసిన పలువురు ఫ్యాన్స్, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, ఇంతకీ ఆ చేతులేంటి పాప అంటూ సరదాగా ఆమెను అడుగుతూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆమె వేసుకున్న ఆ డ్రెస్ లో ఎడమ చేతికి ఫుల్ హ్యాండ్స్ ఉండగా, కుడి చేయి స్లీవ్ లెస్ గా ఉండడం గమనించవచ్చు. మొత్తానికి తన లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్ డ్రెస్సులతో, అదరగొట్టే అందంతో తల్లి శ్రీదేవినే మించి పోతోంది జాహ్నవి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: