రష్మిక మందన్న.. తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యిందీ హీరోయిన్..కేవలం
రెండేళ్లు.. నాలుగు సినిమాలతోనే దూసుకుపోయింది. రష్మిక గురించి చెప్పాలంటే.. ఈ రెండు ముక్కలు చాలు.. అలా తారాపథంలో దూసుకెళ్లిందీ తార. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ పక్కన అలరించింది. ఈ సినిమా సక్సస్ తో మరోసారి లక్కీ హీరోయిన్ అయ్యింది.
అయితే సినిమాలో రష్మిక పాత్ర మరీ ఓవర్ గా ఉందన్న కామెంట్లు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పింది. అవేమిటంటే.. నాగశౌర్య గురించి మాట్లాడుతూ.. “ ఛలో’ షూటింగ్కి వచ్చేంత వరకూ నాగశౌర్య గురించి తెలీదు. తనూ కొత్త హీరో అనుకున్నాను. కానీ షూటింగ్ స్పాట్లో తన నటనని చూసి ఆశ్చర్యపోయాను. ఎంతో అనుభవజ్ఞుడిలా నటించేవాడు.
నాకు నటనలో ఏడుపు అంత త్వరగా రాదు. కానీ తనకు ఈజీగా కన్నీళ్లు వచ్చేసేవి. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే మేం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ‘ఛలో’కి ముందు నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. డైలాగుల్ని అర్థం చేసుకోవడంలో శౌర్య సపోర్ట్ చేశాడు. శౌర్య, దర్శకుడు వెంకీ సహకారంతో సెట్స్లోనే చాలా పదాలు నేర్చుకున్నా.. అంటూ ఈ యంగ్ హీరోను తెగ పొగిడేసింది రష్మిక.
ఇక మహేశ్ గురించి మాట్లాడుతూ.. " మహేశ్ గొప్ప నటుడే కాదు, చాలా గొప్ప వ్యక్తి కూడా అంటోంది రష్మిక. అందం విషయంలో మహేశ్ కు సరితూగలేనని తెలిసి.. నెమ్మదిగా తనకు తానే సర్దిచెప్పుకుందట. మహేశ్బాబుతో డ్యాన్స్ చేయడం కష్టమే అంటోందీ ముద్దుగుమ్మ. మహేశ్ షూటింగ్కి ముందే పాటలోని స్టెప్పుల్ని ప్రాక్టీసు చేసి వస్తారట. ఒక పాటలో రష్మిక డ్యాన్స్ చేయడానికి కంగారు పడుతుంటే... పాటకి తగ్గట్టు స్టెప్పులు ఉండాలంటూ కంగారు పడొద్దని నాకు ధైర్యం చెప్పాడట మహేశ్.
అంతే కాదు.. మహేశ్ సెట్లో ఉన్నారంటే సందడిగా ఉంటుందట. అదే సమయంలో డిసిప్లిన్ కూడా బాగా మెయింటైన్ చేస్తాడట. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెట్స్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయంలో మహేశ్ నుంచి రష్మిక చాలా నేర్చుకుందట రష్మిక.