టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో మంచి జోష్ లో ఉన్నారు. అయితే ఈ మూవీస్ మూడు సామాజిక నేపథ్యంలో రూపొందినవి. ఓ మంచి సోషల్ మెసేజ్ తో ఉన్న ఈ సినిమాలు మహేష్ బాబు కి మంచి హిట్స్ ఇచ్చినా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరుత్సాహంలో ఉన్నారు.  మహేష్ బాబు మంచి దూకుడు లాంటి సినిమా ఎప్పుడు తీస్తారన్న ప్రశ్నలు కూడా వచ్చాయి. దాంతో ఈసారి పూర్తి స్థాయిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో రావాలని సిద్దమయ్యారు. ఇదే సమయంలో కామెడీకి కేరాఫ్ గా ఉన్న దర్శకుడు అనీల్ రావిపూడి ఓ కథ వినిపించడం దానికి మహేష్ బాబు సై అనడం ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కడం జరిగిపోయింది.  

 

ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటేంటే పదమూడేళ్ల తర్వాత లేడి అమితాబ్ విజయశాంతి నటించడం.   సంక్రాంతి సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం సినిమా సక్సెస్ ని యూనిట్ ఎంజాయ్ చేస్తోంది.  తాజాగా ఈ మూవీకి మరింత వన్నె తెచ్చేందుకు ప్రమోషన్లు కూడా ఎక్కువే చేస్తున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకుడు అనీల్ రావిపూడి.. మహేష్ కి చదివి వినిపించాడు.  ఓ అభిమాని మళ్లీ మీరు పోకిరి లాంటి మూవీ ఎప్పుడు తీస్తారు అన్నారు. దానికి మహేష్ బాబు.. కచ్చితంగా భవిష్యత్తులో గొప్ప చిత్రాలను చేద్దామని.. పోకిరిని మించి చేద్దామని తెలిపాడు.

 

ఇదే సందర్బంగా ‘సరిలేరు నీకెవ్వరు’ లో మైండ్ బ్లాక్ సాంగ్ లో శేఖర్ మాస్టర్ డాన్స్ బాగా కంపోజ్ చేశారని ఈ పాటకు మంచి ఫాలోయింగ్ వచ్చిన విషయం తెలిసిందే.  ఇదే విషయాన్ని ఓ అభిమాని  ఇక నుండి ప్రతీ సినిమాకి అతడినే కొరియోగ్రాఫర్ గా పెట్టుకోవాలని మరో ఫ్యాన్ సజెస్ట్ చేయగా.. ఏ సినిమాలో అయినా మంచి హిట్ సాంగ్ వచ్చిందంటే అందరికీ సంతోషమే.. ఈ మూవీలో మైండ్ బ్లాక్ మంచి హిట్.. అంత మంచి హిట్ ఇచ్చిన  శేఖర్ మాస్టర్ తో కలిసి పని చేస్తామని మహేష్ మాటిచ్చాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: