తెలుగు నాట సీరియళ్ళంటే అత్తా కోడళ్ళ గొడవలు, భార్యా భర్తల మధ్య సరిగ్గా లేని సంబంధాలు, కుట్రలు కుతంత్రాలు... ఎక్కువగా ఇవే కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా అత్తా కోడళ్ల గురించి మరీ ఎక్కువ చేసి చూపిస్తుంటారు. అయితే బయట నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది సందేహమే. అయితే ఇలాంటి సీరియల్స్ నడుస్తున్న టైమ్ లో ఒకానొక సీరియల్ వీటన్నింటి కంటే భిన్నంగా ఉండి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

 

అదే అమృతం... అమృత విలాస్ అనే హోటల్ నడుపుకునే ఇద్దరు వ్యక్తుల కథే ఈ సీరియల్ కథ. ఆ ఇద్దరూ తమకి వచ్చిన ఐడియాలతో హోటల్ ని మార్చేద్దామనుకుంటూ ఉంటారు. కానీ ప్రతీ సారి వారి మూర్ఖత్వంతో అవతలి వారి చేతిలో మోసపోతూ ఉంటారు. ఈ సీరియల్ ఎంతలా సక్సెస్ అయిందంటే ఆ సీరియల్ లో నటించిన వాళ్ల ఒరిజినల్ పేర్ల కంటే ఆ సీరియల్ లోని పేర్లే బాగా పాపులర్ అయ్యాయి. సుమారు ఏడేళ్ల పాటు నిర్విరామంగా నవ్వించిన ఈ సీరియల్ మళ్ళీ వస్తోంది.

 

అవును మీరు విన్నది నిజమే.. అమృతం ద్వితీయం పేరుతో ఈ సీరియల్ కి రెండో భాగం వచ్చేస్తోంది. అమృతం' అప్పట్లో జెమిని టీవీలో వచ్చేది. ఐతే ఇప్పుడు జీటీవీ వాళ్లు 'అమృతం ద్వితీయం' పేరుతో కొత్త సీరియల్ మొదలుపెట్టబోతున్నారు. గుణ్ణం గంగరాజు సారథ్యంలో ఆయన తనయుడు సందీప్ గుణ్ణం ఈ సీరియల్ బాధ్యతలు చేపట్టనున్నాడట. కొంచెం పెద్ద స్థాయిలోనే ఈసారి ఈ సీరియల్‌కు శ్రీకారం చుట్టనున్నారు.

 

అయితే అమృతం పాత్రలో శివాజీ రాజా మరియు హర్ష వర్ధన్ చేయగా హర్ష వర్ధన్ చేసిన పాత్రే అందరికీ గుర్తుండిపోయింది. మరి ఇప్పుడు వస్తున్న రెండీ వెర్షన్ లోనూ వాళ్లే నటిస్తారా లేదా కొత్తవాళ్లతో చేస్తారా అన్నది చూడాలి. జస్ట్ యెల్లో నిర్మాణంపై గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ ని తెరకెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: