మహేష్ బాబు నటించిన  లేటెస్ట్ మూవీ  సరిలేరు నీకెవ్వరు  సంక్రాంతి సీజన్ లో  విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నిన్న సంక్రాంతి రోజు, రెండో రోజు కన్నా ఎక్కువ షేర్ ను రాబట్టి  అదుర్స్ అనిపించింది. దాంతో ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో  ప్రీ రిలీజ్ బిజినెస్ లో  80 శాతం రికవరీ చేసింది.  ఇక 5రోజుల్లోనే  ఈసినిమా  నైజాం లో 22.5 కోట్ల షేర్ ను రాబట్టి నాన్ బహుబలి రికార్డు సృష్టించింది.  ఓవరాల్ గా  మహేష్ అక్కడ 20కోట్ల క్లబ్ లో చేరడం ఇది నాల్గో సారి.  అలాగే సరిలేరు..   పశ్చిమ గోదావరి లో ఆల్ టైం రికార్డు సృష్టించగా , తూర్పు గోదావరి, నెల్లూరు లో  నాన్ బాహుబలి రికార్డును సృష్టించింది.  తూర్పు గోదావరి , వైజాగ్ ఏరియాల్లోబ్రేక్ ఈవెన్  కూడా క్రాస్ చేసింది. 
 
ఈ వారం లోగ  ఈచిత్రం అన్ని ఏరియాల్లో  బ్రేక్ ఈవెన్ కానుంది. ఓవర్సీస్ లోమాత్రం ఈచిత్రం కాస్త నెమ్మదించింది. ఇప్పటివరకు యూఎస్ఏ లో 1.80 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది రేపటి తో 2మిలియన్ క్లబ్ లో చేరనుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా  విజయశాంతి  కీలక పాత్రలో  కనిపించింది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.  
 
తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు 5రోజుల కలెక్షన్ల వివరాలు : 
 
నైజాం -22.5 కోట్లు 
సీడెడ్ - 9.75 కోట్లు 
ఉత్తరాంద్ర - 10.5 కోట్లు 
గుంటూరు -7.19 కోట్లు 
తూర్పు గోదావరి - 6.22 కోట్లు 
పశ్చిమ గోదావరి - 4. 54 కోట్లు '
కృష్ణా - 5.55 కోట్లు 
నెల్లూరు - 2. 42 కోట్లు
 మొత్తం 5రోజులకు గాను షేర్ =68.22కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: