టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాల సూపర్ సక్సెస్ లతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, మార్కెట్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు ధీటుగా తన ఇమేజ్ ని పెంచుకున్న ప్రభాస్, ఇటీవల సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రన్ రాజా రన్ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకతవంలో తెరకెక్కిన ఆ సినిమా ఓవర్ ఆల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ మూవీలో నటిస్తున్న ప్రభాస్
ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టేలా సన్నద్ధం అవుతున్నట్లు టాక్.

 

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, కథ ప్రకారం కొన్నేళ్ల క్రితం యూరోప్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ప్రేమ కథగా తెరకెక్కుతున్నట్లు టాక్. గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి అయినట్లు సమాచారం. నిజానికి ఇప్పటివరకు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మొన్నటి నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా యూనిట్ నుండి ఏదయినా అప్ డేట్ వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు, 

 

అయితే ఏమి రాకపోవడంతో వారు కొంత నిరాశ చెందారు. ఇకపోతే ప్రస్తుతం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రేపు ప్రభాస్ నుండి ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద అప్ డేట్ రాబోతున్నట్లు కాసేపటి క్రితం అఫీషియల్ గా న్యూస్ బయటకు రావడం జరిగింది. అయితే అది ఏమై ఉంటుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటినుండే ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి మొదలెట్టేశారు. మరి సాహో తో ఫ్యాన్స్ ని నిరాశపరించిన ప్రభాస్, ఈ సినిమాతో ఎంత మేర హిట్ అందుకుంటాడో చూడాలి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: