మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాను గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఎంతో భారీగా నిర్మించగా, దీనికి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. బన్నీ, పూజ ల జోడితో పాటు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ ఈ సినిమాకు బాగా కలిసి రావడంతో సినిమాకు తొలి రోజు నుండి మంచి టాక్ లభించింది. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో నటించగా, జయరాం, మురళి శర్మ, ఈశ్వరి రావు, సునీల్, సుశాంత్, నివేత పేతురాజ్,

 

నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటించడం జరిగింది. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో త్రివిక్రమ్ తదుపరి సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ లేదా ప్రభాస్ తో ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. నిజానికి అలవైకుంఠపురములో సినిమా సక్సెస్ తరువాత త్రివిక్రమ్ పిలిచి ప్రత్యేకంగా అభినందనిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఏదైనా మంచి స్టోరీ ఉంటె చెప్పమని ఆయనను కోరారని, అయితే త్రివిక్రమ్, కొంత సమయం ఇస్తే మంచి కథ సిద్ధం చేసి చెప్తానని అన్నారట. ఇక మరోవైపు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ వీరిద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చి సినిమా చేస్తారు అనేది మాత్రం అర్ధం కావడం లేదు. 

 

అయితే ఈ విషయమై త్రివిక్రమ్ కూడా కొంత ఆలోచనలో పడ్డట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కావడానికి జూన్ వరకు సమయం పడుతుందని, అయితే జాన్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్, ఏప్రిల్ సమయానికల్లా ఫ్రీ అవుతారని, కావున అవకాశాన్ని బట్టి ముందు ప్రభాస్ తోనే సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరికొద్దిరోజుల్లో గడిస్తేనేకాని త్రివిక్రమ్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: