స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హిట్ అవడంతో సూపర్ జోష్ లో ఉన్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి సూపర్ హిట్ సినిమాగా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. అంతేకాదు ఈ సినిమా బన్ని కెరియర్ లో బ్గ్గెస్ట్ హిట్టు సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ తో మళ్లీ బన్ని ట్రాక్ ఎక్కాడని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు తర్వాత ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూస్ లోనే బన్ని సొంత ఆఫీస్ పెట్టడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గీతా ఆర్ట్స్ ఉండగా బన్ని కొత్త ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నాడు.

 

అల్లు అరవింద్ తో ఏమైనా తేడా లొచ్చాయా.. అల్లు బ్రదర్స్ ముగ్గురు మధ్య గొడవలు జరిగాయా అన్న రేంజ్ లో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమి లేదని నవ్వేశాడు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్ లో చాలా సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి. 24 గంటలు ఏదో ఒక సినిమా టీం అక్కడ ఉంటున్నారు. తనకు కాస్త ప్రైవసీ కావాలని అనిపించింది.. అందుకే వేరే ఆఫీస్ తీసుకున్నా అని అన్నారు అల్లు అర్జున్. అంతేకాని తన తండ్రితో విభేదాలు వచ్చి కాదని చెప్పారు. తన ఆఫీస్ లో తన సినిమాలకు సంబందించిన చర్చలు మాత్రమే జరుగుతాయని అన్నారు.

 

అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత మురుగదాస్, వేణు శ్రీరాం సినిమాలు లైన్ లో ఉన్నాయి. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ కొద్దిపాటి గ్యాప్ తీసుకుని ఈసారి కొడితే గట్టి హిట్టు కొట్టాలనుకుని మరి త్రివిక్రం తో ఈ సినిమా చేశాడు. అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన కూడా చాలా కొత్తగా అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: