మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా కనిపిస్తుండగా, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తెచ్చుకున్న బాబీసింహా కూడా కనిపిస్తున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం లాంటి థ్రిల్లర్ సినిమాలు తీసిన ఈ దర్శకుడు రవితేజ లాంటి మాస్ హీరోతో సినిమా చేయడం నిజంగా అద్భుతమే..

 

 

అయితే ఇప్పటికే విడుదల అయిన టీజర్ ని చూస్తుంటే ఈ సినిమా ద్వారా రవితేజ మరోసారి పూర్తి మాస్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. విడుదల అయిన టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా డిస్కోరాజా టీమ్ మీడియాకి ఇంటర్వ్యూలని ఇచ్చింది. దానిలో మాట్లాడుతూ రవి తేజసినిమా గురించి, తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

 

 

దర్శకుడు విఆనంద్ రవితేజను ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఏ జోనర్ చిత్రాలలో నటించడానికి ఇష్టపడతారు అని అడుగగా రవితేజ ఈ విధంగా సమాధానమిచ్చారు. గతంలో నేను కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడే వాడిని, అందుకే కిక్, విక్రమార్కుడు వంటి చిత్రాలలో నటించి, సూపర్ హిట్స్ అందుకున్నాను. అదే సమయంలో నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించాను. ఆ చిత్రాలు నాకు ఎంతో ఇష్టం కానీ, అవి ఆడలేదు.

 

 

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. . సినిమాలో కొత్తదనం, కొత్త కాన్సెప్ట్ లేకపోతే చూడటం లేదు. పాత్ర భిన్నంగా ఉంటే విలన్ పాత్రలు చేయడానికైనా నేను సిద్ధం అన్నారు. ఇక ప్రస్తుతం డిస్కోరాజా సినిమా ఈ నెల 24 వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: