సంక్రాంతి పండుగకు సినిమాల సందడి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి బరిలో దిగిన మహేష్ హిట్ టాక్ వచ్చినా సినిమా ఈ రేంజ్ వచ్చింది అంటే అది కేవలం వాళ్ల వల్లే అని చెప్పొచ్చు. సంక్రాంతి సినిమా అంటే లాస్ట్ ఇయర్ ఎఫ్-2 అంటూ వచ్చి హిట్ అందుకున్న అనీల్ రావిపుడి ఈ సంక్రాంతికి మహేష్ తో సరిలేరు నీకెవ్వరుతో వచ్చాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లు అందుకున్న అనీల్ రావిపుడి క్రేజ్ కూడా ఈ సినిమాకు యాడ్ అయ్యింది.

 

ఇక సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు. సినిమాలో భారతి పాత్రలో ఆమె నటన అద్భుతం. సినిమాలో విజయశాంతిని పెట్టుకోవడం కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యేందుకు తోడ్పడిందని చెప్పొచ్చు. రష్మిక మందన్నకు యూత్ లో ఉన్న క్రేజ్ కూడా సినిమాకు ప్రత్యేకత తెచ్చింది. ఫైనల్ గా కొన్నాళ్లుగా మహేష్ ను మాస్ లుక్ లో చూడాలనుకునే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా కిక్ ఇచ్చింది. ఈ అంశాలన్ని సరిలేరు నీకెవ్వరు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సినిమాలో కథ అంత గొప్పగా లేకున్నా సినిమా మాత్రం సూపర్ హిట్ అనిపించుకుంది.

 

సినిమాకు సంబందించిన ఈ కీ ఫ్యాక్టర్స్ మహేష్ కు హిట్ ఇచ్చేలా చేశాయి. అయితే ఈ సినిమాకు పోటీగా వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కూడా సెన్సేషనల్ హిట్ అందుకుంది. త్రివిక్రం మార్క్ ఎంటర్టైనర్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అటు త్రివిక్రం.. ఇటు అల్లు అర్జున్ ఇద్దరిని హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: