టాలీవుడ్ లో జంద్యాల తర్వాత ఆ తరహా మూవీస్ తెరకెక్కించింది ఈవీవీ సత్యనారాయణ.  ఆయన ఎన్నో కామెడీ సినిమాలు తెరకెక్కించారు.   ఆ తరహా సినిమాలు ఇటీవల కాలంలో  అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కామెడీ మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకుంటూ సినిమాలను సూపర్ హిట్ చేస్తున్నారు. తాజాగా అనల్ రావిపూడి దర్శకత్వంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు  నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మంచి విజయం అందుకుంది.   అయితే గత ఏడాది సంక్రాంతి కానుకగా వెంకటేష్నాగచైతన్య కాంబినేషన్ ఎఫ్2 మూవీ తెరకెక్కించాడు. 

 

మూవీ సూపర్ హిట్ అయ్యంది.. ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది మంచి కలెక్షన్స్ బాగా రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ బాబు,  రష్మిక మందన జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ అయిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించి కలెక్షన్లు సాధిస్తుంది.  మరోవైపు  ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయబోతున్నట్టు చిత్ర బృందం అప్పట్లోనే ప్రకటించింది. అందులో రవితేజ నటించవచ్చని అప్పట్లో  వార్తలు వచ్చాయి.

 

తాజాగా ఈ విషయంపై అనీల్ రావిపూడి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎఫ్3 టోటల్ గా డిఫరెంట్ ప్రపంచం. మొగుడు పెళ్ళాల స్టోరీ కాదు. హీరో హీరోయిన్లు మాత్రమే వారే ఉంటారు. వారి కోరికలు, టార్గెట్స్ వేరుగా ఉంటాయి. వెంకటేష్ అసురన్ రీమేక్ షూటింగ్ ఈ నెలలో మొదలు పెడతారు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఎఫ్ 3 మొదలు అవుతుంది. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీ ఈ మూవీలో దుమ్మురేపాయి.. మరి ఎఫ్ 3 ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. మరోసారి అనీల్ రావిపూడి తన మార్క్ చాటుకుంటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: