ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ రేంజ్ ఉన్న హీరో ఎవరు అంటే ఎటువంటి అనుమానం లేకుండా ప్రభాస్ పేరే చెబుతారు. ఒక్క బాహుబలి చిత్రం తో అతను పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. ఇటీవల విడుదలైన సాహో సినిమా విపరీతమైన నెగటీవ్ టాక్ మరియు తక్కువ రేటింగ్ లు తెచ్చుకున్నప్పటికీ కూడా బాలీవుడ్ లో తెలుగు కి మించి వసూళ్ళ మోత మోగించింది. అయితే రోజుల్లో ఎంత పెద్ద హీరో అయినా కూడా ఫ్యాన్ మేనేజ్మెంట్ అన్నది చాలా కీలకమైన విషయం.

 

నిరంతరం తమ అభిమానులను ఏదో ఒక అప్డేట్ ఇచ్చి ఎంగేజ్ చేస్తూ ఉండకపోతే సినిమా రిలీజ్ సమయంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. సినిమాను జనాల్లోకి తీసుకొని వెళ్ళేది…. యాంటీ ఫ్యాన్స్ ను ఢీకొట్టి నెగిటివిటీ రాకుండా చూసేది కూడా వాళ్లే. ఎంతకాదన్నా భారీ ఓపెనింగ్స్ రావాలంటే కేవలం అది అభిమానం వల్ల మాత్రమే అవుతుంది. అయితే ప్రభాస్ ముందు నుండి విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు.

 

తన అభిమాన గణాన్ని ప్రభాస్ ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇది ప్రభాస్ సింప్లిసిటీలో భాగం కావచ్చు. కానీ కాలంలో అలా ఉంటే సరిపోదు. ప్రభాసే ఇలా ఉంటే.. అతడి మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్ వాళ్లు మరీ టూమచ్. ‘సాహోవిషయంలో ఎప్పుడూ సరైన అప్ డేట్ ఇవ్వక, అభిమానులతో సమయానుకుంటూ విశేషాలు పంచుకోక విపరీతంగా ఏడిపించారు. దీనిపై అభిమానులు ఎంతగా గొడవ చేశారో తెలిసిందే. అయినా వాళ్లలో మార్పు లేదు.

 

ఐతే ఇప్పుడేదో 'జాన్' అప్ డేట్ రాబోతోందంటూ రెండు మూడు రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తున్నారు. చివరికి చూస్తే ప్రభాస్జాన్’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ కొనసాగించబోతున్నాడంటూ అత లుక్ కూడా సరిగా కనిపించని ఒక మామూలు ఫొటో ఒకటి వదిలేసి పండగ చేసుకోమన్నారు యువి వాళ్లు. దీంతో ఫ్యాన్స్‌కు మండిపోయి ఇదీ ఒక అప్ డేటా అంటూ తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: