నభా నటేష్ 'నన్నుదోచుకుందువటే' సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులనులందరిని ఆక్ట్టుకుంది. ఒక్క టాలీవుడ్ ప్రేక్షకులనేకాదు మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది. అయినా కూడా ఎందుకనో ఈ అమ్మడికి వెంటనే మళ్ళీ సినిమా ఛాన్స్ రాలేదు. అయితే ఎట్టకేలకు పూరి 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఒక హీరోయిన్ గా రాం సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సస్ ని అందుకుంది. ఈ ఉత్సాహంతో ఉన్న నభా ఇప్పుడు మరో సినిమాతో రెడీ అవుతోంది. తెలుగులో నభా రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కించుకొని ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అవుతోంది. 'డిస్కోరాజా'లో ఒక హీరోయిన్ గా నటించింది నభా.
వాస్తవానికి నభా కెరీర్ కన్నడ సినిమాలతో ప్రారంభం అయ్యింది. అక్కడ పెద్ద సినిమాల్లోనే నటించినప్పటికి తన చూపు మాత్రం టాలీవుడ్ వైపే ఉండింది. అందుకు ఒక కారణం కన్నడలో రెమ్యూనరేషన్ తక్కువ కావడం. అయితే తెలుగు సినిమాల్లో వరుసగా రెండు హిట్స్ పడితే హీరోయిన్ రెమ్యూనరేషన్ భాగా పెరిగిపోతుంది! ఇప్పుడు నభా నటేష్ కు రెమ్యూనరేషన్ విషయంలో బాగా కలిసి వస్తుందని అంటున్నారు సినీ జనాలు.
మూడు తెలుగు సినిమాల ఎక్స్ పీరియన్స్ తో నభా ఇప్పుడు 80 లక్షల వరకు అందుకుంటోందని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన గుర్తింపుతో నభాకు డిస్కోరాజా సినిమాలో రవితేజ సరసన నటించే ఛాన్స్ దక్కింది. ఇప్పుడు ఈ గుర్తింపుతో తర్వాతి సినిమాలకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న జాబితాలో చేరుతోందట నభా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించబోయే సినిమాలో నభా నటేష్ నటించనుందని తాజా సమాచారం. అసలే బెల్లంకొండ సినిమాలంటే హీరోయిన్లకు భారీ రెమ్యూనరేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నభా 80 లక్షల క్లబ్ లో చేరబోతోందని తెలుస్తోంది. మొత్తానికి మూడంటే మూడు సినిమాలకే 80 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.