రాజమౌళి ఎంత బిజీగా ఉన్నా టాప్ హీరోల సినిమాలు విడుదల అయితేచాలు వాటిని చూడటమే కాకుండా వాటి పై తన స్పందనను తెలియచేయడం రాజమౌళికి ఉన్న  అలవాటు. అయితే ఈ సంక్రాంతి రేస్ కు వచ్చిన ‘సరిలేరు’ ‘అల’ సినిమాల పై తన అభిప్రాయాలను తెలియచేయడం అటుంచి ఆ సినిమాలను చూడడానికి కూడ రాజమౌళి ఆసక్తి కనపరచడంలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో రాజమౌళి బిజీగా ఉన్నా పండుగ రెండు రోజులు రాజమౌళి తన కుటుంబ సభ్యులతోనే కాలం గడిపాడు అని తెలుస్తోంది. ‘మత్తు వదలరా’ ప్రీమియర్‌ షో చూసి ఆ చిత్రాన్ని ఆశీర్వదించాలంటూ అభిమానులని కోరిన రాజమౌళి మళ్ళీ తన ట్విట్టర్‌లో ఎక్కడా హడావిడి చేయలేదు. దీనితో ఈ సంక్రాంతికి దూరంగా మౌనంగా ఉండడమే మంచిదని జక్కన్న భావిస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

వాస్తవానికి మహేష్ తో సినిమాను చేసే ఉద్దేశం రాజమౌళికి ఉంది. అయితే ఆ మూవీ ఎప్పుడు ఉంటుంది అన్న విషయం  ప్రస్తుతానికి క్లారిటే లేదు. అదేవిధంగా అల్లు అరవింద్ తో పాటు బన్నీతో కూడ రాజమౌళికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలాంటి పరిస్థితులలో సంక్రాంతి రేస్ లో ఇంత హడావిడి జరుగుతున్నా  రాజమౌళి ఈ రెండు సినిమాల పై మౌనం వహించడం వెనుక కారణం ఏమిటి అంటూ మహేష్ బన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి తన పద్దతి మార్చుకుని మిగతా దర్శకుల సినిమాల పై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా తెలియ చేయకూడదు అన్న ఉద్దేశ్యంతో ఈ మౌన ముద్ర కొనసాగుతోంది అని అంటున్నారు. అయితే రాజమౌళి ప్రశంసలు అంటే జనంలో ఐఎస్ఐ మార్క్ కన్నా ఎక్కు విలువ ఉంటుంది కాబాట్టి తమ హీరోల సినిమాల పై కూడ రాజమౌళిని స్పందించమని బన్నీ మహేష్ అభిమానులు కోరుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: