సరిలేరు నీకెవ్వరూ సినిమా దూసుకుపోతున్నది.  కలెక్షన్లు కూడా దూసుకుపోతున్నాయి.  ఇప్పటికే సినిమాకు భారీ వసూళ్లు రావడంతో సినిమా విషయంలో మంచి వసూళ్లు దక్కుతున్నాయి.  మరో మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రాబోతున్నది.  ఈ బ్రేక్ ఈవెన్ కోసం మహేష్ బాబు ఎదురు చూస్తున్నారు.  ఈ వీకెంట్ తో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా విషయంలో ఆడియన్స్ నుంచి వస్తున్న ఒకేఒక మాట సినిమా నిడివి.  


సినిమా నిడివి విషయంలో కొంత గందరగోళం నెలకొని ఉన్నది.  సినిమా నిడివి ఎక్కువగా ఉందని, ట్రైన్ ఎపిసోడ్ మరీ ఎక్కువైందని అంటున్నారు.  అలానే ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ పోర్షన్ లు కూడా కొద్దిగా లెంగ్తిగా ఉన్నాయని చెప్తున్నారు.  దీంతో యూనిట్ దీనిపై దృష్టి పెట్టింది.  నిడివి ఎక్కువగా ఉన్న సీన్స్ నుంచి కొన్నింటిని కట్ చేసి సమయాన్ని తగ్గించింది.  ఇది సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.  


సినిమా విషయంలో ఇప్పుడు కొన్ని తీసుకున్న నిర్ణయాలు అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధం అవుతున్నాయి.  ఇందులో భాగంగానే కొన్ని సీన్స్ ను ఇప్పటికే తొలగించారని తెలుస్తోంది.  కాగా, ట్రిమ్ చేసిన సినిమా ఈరోజు నుంచి థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. సమయం తగ్గిపోతుంది కాబట్టి ఇది సినిమాకు మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉన్నది.  మరో ఈరోజు రేపు వీకెండ్ ఉన్నది కాబట్టి వసూళ్లు ఈ రెండు రోజులు కూడా బాగానే ఉంటాయి.  


ఇప్పటికే సినిమా భారీ వసూళ్లు సాధించింది.  నైజాంలో మహర్షి షేర్ ను బ్రేక్ చేసే దిశగా పరుగులు తీస్తున్నది.  కొన్ని చోట్ల ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ ను సొంతం చేసుకున్నది.  మహర్షి కలెక్షన్లను బీట్ చేసి, సరికొత్త రికార్డ్ సృష్టించేందుకు సరిలేరు నీకెవ్వరు సినిమా దూసుకుపోతున్నది.  సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో మహేష్ బాబు ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు.  కాగా, సినిమా ఫైనల్ వసూళ్ల రిపోర్ట్ తరువాత మహేష్ విదేశాలకు వెళ్లనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: