'నా పేరు సూర్య..' లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. చాలా కాలం తర్వాత 'నా పేరు సూర్య' సినిమా ప్లాప్ అయిన తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని బన్నీ నటించిన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు మెగా అభిమానులు. పాటల పరంగా మరియు సినిమా టేకింగ్ పరంగా అన్ని రకాలుగా ప్రేక్షకులను సినిమా అలరించడం తో సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా వచ్చిన సినిమాలు అన్నిటికంటే అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

 

ఫ్యామిలీ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని అల్లు అరవింద్ మరియు ఎస్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ వారి బ్యానర్లలో గీతా ఆర్ట్స్ మరియు హారికా & హాసిన్ క్రియేషన్స్ నిర్మించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇద్దరు నిర్మాతలు మంచి లాభాలు అందుకుంటున్నారు. అంతేకాకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ నగరంలో సినిమాకి సంబంధించి అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడానికి సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి రెడీ అయ్యారు ఇద్దరు నిర్మాతలు.

 

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో పోటీపడి ఈ సినిమాలో ఓడిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఓవర్సీస్లో అల్లు అర్జున్ కన్నా త్రివిక్రమ్ కి మంచి మార్కెట్ ఉంది. అయితే అల్లు అర్జున్ తన గత సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఓవర్సీస్లో వస్తాయని ఆ స్థాయిలోనే కలెక్షన్లు వస్తాయని త్రివిక్రమ్ తో ఛాలెంజ్ చేశారట. కానీ ఆ తర్వాత సినిమా రిలీజయ్యాక లెక్కలు చూస్తే కళ్ళు చెదిరిపోయే ఈ విధంగా ఓవర్సీస్లో కలెక్షన్లు రావడంతో అనుకున్న దాని కన్నా బన్నీ నటించిన గత సినిమాలు కంటే ఓవర్సీస్లో త్రివిక్రమ్ తో చేసిన ఈ సినిమాకు భారీ లెవల్లో కలెక్షన్లు రావడంతో త్రివిక్రమ్ తో బన్నీ ఓడిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే ఓవర్సీస్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకి ఎన్నారైలు బ్రహ్మరథం పడతారని అలా వైకుంఠపురం లో సినిమాతో మరోసారి రుజువైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: