లోకంలో మనిషిగా పుట్టిన ప్రతివారికి స్వార్ధం అనేది కామన్‌గా మారిపోయింది. అందువల్ల ప్రస్తుతం మహానుభావులు లేకుండా స్వార్దపరులతో ఈ ప్రపంచం మూడు మర్డర్లు, ఆరు హత్యాచారాలతో, మోసాలతో, సుభిక్షంగా అలరాడుతుంది. అయితే స్వార్థం అనేది శ్రుతిమించిదే ప్రమాదం. స్వార్థంగా మారితే అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారినీ దూరం చేస్తుంది.

 

 

ఆ తీరును తగ్గించుకోవాలంటే స్వార్థం పెరిగిపోకుండా చూసుకోవాలని, పక్కవాడు ఏమైపోయినా ఫర్వాలేదు, మనం సుఖంగా ఉంటే చాలు. నాది అనుకున్నది నాకే దక్కాలి. మరెవ్వరికీ దక్కకూడదు  అనే మనస్తత్వంతో ఉండే మనుషులు మనకు తరచు తారసపడుతూనే ఉంటారు. ఇకపోతే పోటీ ప్రపంచంలో కొంతైన స్వార్ధంతో ఉండకుంటే అణగ త్రొక్కుతారు.. ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో మహేష్  మాట్లాడినప్పుడు తన కెరీర్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేయడం అని చెబుతున్నాడు.

 

 

ఇక ఇప్పటికే  ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న విషయం తెలిసిందే.. అయితే మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు సినిమాను ఒప్పుకోకముందే సుకుమార్ తో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట. నిజానికి మహర్షి చిత్రం ముగిసిన తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి. కానీ మహర్షి చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ రావిపూడి ఇచ్చిన 40 మినిట్స్ నరేషన్ నచ్చి అప్పటికే ఒక కమిట్మెంట్ ఉందని, ఏడాది తర్వాత ఈ సినిమా చేద్దామని అనిల్ కు చెప్పాడట.

 

 

ఈలోపల అనిల్ చేసిన ఎఫ్ 2 సినిమా చూసిన మహేష్ ఇంప్రెస్ అయిన వెంటనే తనలో స్వార్ధం మొదలైందట.. అంతే వెంటనే అనిల్ తో సినిమా ఎందుకు చేయకూడదు అని అనిపించి, అనిల్‌కు కబురందించగా మూడు నెలల్లో పూర్తి స్క్రిప్ట్ తో మహేష్ ముందు వాలగా చక చకా జులైలో సినిమాను మొదలుపెట్టి డిసెంబర్ కల్లా పూర్తి చేసేసాం అని సరిలేరు నీకెవ్వరు జర్నీని వివరిస్తూ, చాలా ఓపెన్ గా, తన స్వార్థంతోనే సుకుమార్ సినిమాను సైడ్ చేసేసానని చెప్పాడు మహేష్. ఇక సుకుమార్ ఈలోగా బన్నీతో ఒక సినిమాకు కమిటయ్యాడు. మరి తాజాగా మహేష్ చేసిన వ్యాఖ్యలకు సుకుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలనుకుంటున్నారట కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: