స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు రెండు డిజాస్టర్ సినిమాల తర్వాత ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తీసుకున్నాడు. కానీ సంక్రాంతికి వచ్చి 'అల వైకుంఠపురం లో' చిత్రంతో భారీ హిట్ సాధించాడు. చిత్రం రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరంగా ఒక్క ఏరియాని వదలకుండా రికార్డులు సాధిస్తూపోతోంది. దీంతో సుకుమార్ తో అల్లు అర్జున్ చేయబోయే తదుపరి సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

 

అయితే సినిమా వారికి సెంటిమెంటు చాలా ఎక్కువ. మామూలుగా సెంటిమెంట్ ని పట్టించుకోని వాళ్ళు కూడా సినిమా రంగంలోకి వస్తే వాటిని అనుసరిస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా వరకూ తన సినిమా పేర్లు '' తో మొదలయ్యేలా చూసుకుంటాడు. మరో టాప్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రంగస్థలం తో భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్ తర్వాత చిత్రం కూడా అదే రేంజ్ లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడట.

 

 

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథ లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న చిత్రం దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడు.

 

బన్నీతో చేయబోయే తన తర్వాతి సినిమా విషయంలోరంగస్థలంను ఆయన చాలా రకాలుగా ఫాలో అవుతున్నట్లుంది. దాని మాదిరే ఇదీ పీరియడ్ ఫిలిం. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులోనూ థ్రిల్లర్ లక్షణాలున్నాయట.

అలాగే హీరో లుక్ విషయంలోనూ రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య పోలికలుంటాయంటున్నారు. ఇవన్నీ కాక టైటిల్ విషయంలోనూ ‘రంగస్థలం’ను అనుసరించనున్నాడట సుక్కు. 

ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. దీని సౌండింగ్ ‘రంగస్థలం’ను గుర్తు చేస్తోంది. అది కూడా ఒక ప్రాంతాన్ని సూచించేదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: