ఉయ్యాల జంపాల మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు  రాజ్ తరుణ్.  తర్వాత సినిమాల తో మంచి విజయం అందుకొన్నాడు. కుమారి  21 ఎఫ్, సినిమా, చూపిస్త మామ ఇలాంటి మూవీస్ తో మంచి విజయాలు అందుకొన్నాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు పెద్ద విజయాన్ని అందుకోలేక పోతున్నాయి. ఇటీవల లవర్ సినిమాతో వచ్చిన ఆ మూవీ కూడా విజయం అందుకోలేకపోయింది.  తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీ  షూటింగ్ పూర్తయ్యింది. దర్శకుడు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీకి కి విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా వ్యవహరిస్తోన్నారు.  ఈ మూవీకి కె.కె.రాధామోహన్ నిర్మాత వ్యవహరిస్తున్నారు.  మూవీ చిత్రీకరణ పూర్తయింది . వేసవి కానుకగా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

 

ఈ మూవీలో హీరోయిన్గా మాళవిక నాయర్ నటిస్తుంది.  అయితే ఈ మూవీ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు . బుజ్జిగాడు చేసే హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది.. రాజ్ తరుణ్ కెరీర్లో ఇదొక మంచి హిట్ అందుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఉయ్యాల జంపాల మూవీ తో మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఆ తర్వాత వచ్చిన సినిమా చూపిస్త మామ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది.  ఆ తర్వాత హీరో మంచు విష్ణు తో కలిసి నటించిన వీడోరకం ఆడోరకం మూవీ కూడా మంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో హిట్ అయింది.

 

 ఒరేయ్ బుజ్జి గా  మూవీ ప్రేమ, కుటుంబం, అనుబంధాల కలబోతగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు.  గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారని అంటున్నారు.  ఈ మూవీ లో హెబ్బా పటేల్, వాణి విశ్వనాథ్ ,నరేష్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి  సినిమాటోగ్రఫీ ఆండ్రూ, కథ స్క్రీన్ప్లే దర్శకత్వం కొండా విజయ్ కుమార్.  కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందుతున్న ఈ మూవీపై రాస్తారు నిన్ను ఆశలు పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: